ఏన్కూరు: వరి, పత్తికి బదులుగా ప్రత్యామ్నాయంగా ఆయిల్పామ్ సాగు చేస్తే ప్రభుత్వం నుంచి రాయితీలు అందడమేకాక రైతులకు లాభాలు వస్తాయని కలెక్టర్ దివాకర తెలిపారు. ఏన్కూరు మండలం గార్లొడ్డులో ఆయిల్ పామ్ తోటను పరిశీలించగా.. పది ఎకరాల్లో సాగు చేస్తుండగా, ఎకరాకు రూ.80వేల ఆదాయం వస్తోందని రైతు కట్టా రాంబాబు చెప్పారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మరింత మంది రైతులు సాగు చేసేలా అవగాహన కల్పించడంతో అంతర పంటల సాగుతో లాభాలను వివరించాలని ఉద్యాన అధికారి ఆకుల వేణుకు సూచించారు. తహసీల్దార్ శేషగిరిరావు, రైతులు పాల్గొన్నారు.


