
మైసూరు : మా కుక్క పోయింది,మీరేమైనా చూశారా అని ఓ మహిళా రైతుకు కుక్క ఫొటోను చూపించిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని కనకం గొలుసును లాక్కొని పరారైన ఘటన మైసూరు తాలూకా ఇలవాల ఫిర్కా కల్లూరు నాగనహళ్లి గ్రామంలో జరిగిం ది. గ్రామ నివాసి కుళ్లేగౌడ భార్య కుమారి (47) బాధితురాలు.ఆమె పశువులకు నీరు తాగించేందుకు చిక్కెరె వద్దకు వెళ్లారు.
ఆ సమయంలో బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమెను పలకరించి కుక్క ఫొటోను చూపించి ఇది తమ కుక్కేనని, తప్పిపోయిందని, మీరే మైనా చూశారా అని అడిగారు. ఆమె కుక్క ఫోటోను చూస్తుండగా మెడలోని రూ.3.20 లక్షల విలువ చేసే 37 గ్రాముల బంగారు మం గళసూత్రాన్ని లాక్కొని పరారయ్యారు. బాధితురాలు కేకలు వేసినా చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ఫలితం లేకపోయింది. ఇలవాల ఠాణాలో ఫిర్యాదు చేసింది.