విహారయాత్రలో ప్రమాదం, ఒకరు మృతి | - | Sakshi
Sakshi News home page

విహారయాత్రలో ప్రమాదం, ఒకరు మృతి

Aug 18 2025 5:49 AM | Updated on Aug 18 2025 5:49 AM

విహారయాత్రలో ప్రమాదం, ఒకరు మృతి

విహారయాత్రలో ప్రమాదం, ఒకరు మృతి

శివమొగ్గ: విహారయాత్రకు వెళ్తూ ఉండగా పికప్‌ వాహనం, మారుతీ ఓమ్ని కారును ఎదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఓమ్నిలోని ఒకరు మరణించగా, 8 మంది తీవ్రంగా గాయపడిన సంఘటన శివమొగ్గ జిల్లాలోని సాగర తాలూకా బలెగారు గ్రామంలో జరిగింది. వివరాలు.. చిక్కమగళూరు జిల్లా ఎన్‌ఆర్‌ పుర తాలూకాకు చెందినవారు ఓమ్ని కారులో జోగ్‌ జలపాతం చూడడానికి వెళ్తున్నారు. ఈ సమయంలో పికప్‌ వ్యాన్‌ ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. రెండు వాహనాలు దూరంగా ఎగిరిపడ్డాయి. ఓమ్ని కారులో ఉన్న శేఖర్‌ అనే చనిపోగా, మరో 8 మందికి గాయాలతో ఆర్తనాదాలు చేశారు. ఓమ్ని మొత్తం నుజ్జయింది. స్థానికులు, పోలీసులు కలిసి బాధితులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాద స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే బేళూరు గోపాలకృష్ణ పరిశీలించారు. సాగర గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement