
ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధం
మండ్య: వేసవి అధిక ఉష్ణోగ్రతలా, లేక యాంత్రిక లోపాలా తెలియదు కానీ వాహనాలు రోడ్డుపై తగలబడిపోతున్నాయి. ప్రయాణికులతో వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైన ఘటన మండ్య జిల్లాలోని నాగమంగళ తాలూకాలోని బెంగళూరు– మంగళూరు హైవేలో కదబహళ్ళి టోల్ గేట్ వద్ద శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఉడుపి నుంచి బెంగళూరు వైపు వెళుతున్న రేష్మా ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. పసిగట్టిన డ్రైవర్ బస్సును నిలిపి ప్రయాణికులను హెచ్చరించాడు. 20 మంది ప్రయాణికులు ఉండగా అందరూ దిగిపోతున్న సమయంలో మంటలు పూర్తిగా వ్యాపించాయి. నిమిషాల్లోనే బస్సు కాలిపోయింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. స్థానిక ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలను అదుపు చేశారు. బిండిగనవిళె పోలీసులు కేసు నమోదు చేశారు.
బూడిదైన కారు
దొడ్డబళ్లాపురం: వెళుతున్న కారులో మంటలు చెలరేగి నడిరోడ్డులో కాలిబూడిదైన సంఘటన గదగ్ శివారులో చోటుచేసుకుంది. ఈరన్న అనే వ్యక్తి కుటుంబంతో కలిసి మారుతి బ్రిజా కారులో వెళ్తుండగా ఇంజిన్ భాగం నుంచి అగ్నికీలలు చెలరేగాయి. కారును నిలిపివేసి ఉన్నవారంతా దిగి దూరంగా పరిగెత్తి ప్రాణాలు దక్కించుకున్నారు. క్షణాల్లో కారు పూర్తిగా కాలిపోయింది. గదగ్ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
మండ్య జిల్లాలో ప్రమాదం

ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధం