బతుకుదెరువు కోసం పెంచుకుంటున్న ఆవులను మేపేందుకు ఊర్లో సరిపడా గడ్డి లేదు. చేసేదేమి లేక ఆవులను తీసుకొని గడ్డి ఉన్న అటవీ ప్రదేశాలకు వెళ్తాం. రోజంతా అటవీ ప్రాంతంలో మేపి రాత్రి గ్రామ సమీపంలోని రైతుల పంట పొలాల్లో మందను ఉంచుతాం. దీని ద్వారా ఆవు పేడ, మూత్రంతో భూమిలో పోషకాలు పెరిగి పంట దిగుబడి ఎక్కువగా వత్తాంది. ఇలా ఇంట్లో నుంచి వెళ్లినప్పటి నుంచి తిరిగి పోయే వరకు ఏడాది గడత్తాంది. – కున్సోత్ హంసి,
ఆవుల పోషకురాలు, కున్సోత్తండా, మానాల


