జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ మార్కె ట్ కార్యాలయంలో గురువారం చైర్పర్సన్ పూల్లూరి స్వప్న ఆధ్వర్యంలో పాలకవర్గ సమావేశం జరిగింది. 2025–26 ఆదాయ వ్యయాలపై సమీక్ష నిర్వహించారు. పాత, కొత్త మార్కె ట్ ప్రహరీ నిర్మాణం, చెక్ పోస్టుల వద్ద సీసీ కె మెరాల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ము న్సిపల్ చైర్మన్ ములుగు ప్రశాంత్కుమార్, ఇన్చార్జి కార్యదర్శి రాజా, వైస్ చైర్మన్ ఎర్రం సతీశ్రెడ్డి, డైరెక్టర్లు పాల్గొన్నారు. కాగా.. మార్కెట్ 13 మంది రైతులు 98 క్వింటాళ్ల పత్తిని తెచ్చారు. గరిష్ట ధర రూ.7,500, మోడల్ ధర రూ.7,300, కనిష్ట ధర రూ.7,000 పలికింది.


