నలుగురు గంజాయి స్మగ్లర్ల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

నలుగురు గంజాయి స్మగ్లర్ల అరెస్ట్‌

Aug 16 2025 7:23 AM | Updated on Aug 16 2025 7:23 AM

నలుగురు గంజాయి స్మగ్లర్ల అరెస్ట్‌

నలుగురు గంజాయి స్మగ్లర్ల అరెస్ట్‌

వరంగల్‌ క్రైం: హనుమకొండ పోలీసులు, తెలంగాణ యాంటీ నార్కొటిక్స్‌ డ్రగ్స్‌ కంట్రోల్‌ టీం ఆధ్వర్యంలో నలుగురు గంజాయి స్మగ్లర్లను అరెస్ట్‌ చేశారు. హనుమకొండ పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ నరసింహారావు వెల్లడించిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం హనుమకొండ కుమార్‌పల్లిలోని సెయింట్‌ జోసెఫ్‌ స్కూల్‌ దగ్గర నలుగురు వ్యక్తులు ఎండు గంజాయి కలిగి ఉన్నారని వచ్చిన సమాచారంతో నార్కొటిక్స్‌ సీఐ శ్రీకాంత్‌, ఎస్సై సీహెచ్‌ పరుశురాములు, సిబ్బందితో కలిసి వెళ్లి కారులో గంజాయిని తరలిస్తున్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్‌కు చెందిన ఎండీ పైజాన్‌, ఎస్‌డీ అన్సార్‌, ఎండీ అర్బాన్‌, కుమార్‌పల్లికి చెందిన అర్షద్‌ అలీఖాన్‌ను అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరి నుంచి 25కిలోల 800గ్రాముల ఎండు గంజాయితోపాటు ఐదు సెల్‌ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పైజాన్‌, అన్సార్‌, అర్బాన్‌.. ఆంధ్రప్రదేశ్‌– ఒడిశా బార్డర్‌ వద్ద బాలు అనే వ్యక్తి నుంచి గంజాయిని తీసుకొచ్చి హనుమకొండలోని కుమార్‌పలి్‌?ల్క చెందిన అర్షద్‌ అలీఖాన్‌ ఇంట్లో డంప్‌చేసి, అవసరమైన వాళ్లకి విక్రయిస్తుంటారు. ఈక్రమంలో గంజాయిని కారులో తీసుకొస్తూ పోలీసులకు పట్టుబడ్డారని తెలిపారు. నిందితులను హనుమకొండ పోలీసులకు అప్పగించగా ఇన్‌స్పెక్టర్‌ మచ్చ శివకుమార్‌ కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. కార్యక్రమంలో యాంటీ నార్కొటిక్‌ డ్రగ్స్‌ కంట్రోల్‌ టీం, హనుమకొండ పోలీస్‌స్టేషన్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

25 కిలోల 800 గ్రాముల గంజాయి, కారు స్వాధీనం

వివరాలు వెల్లడించిన ఏసీపీ నరసింహారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement