జిల్లాలో 336ఎకరాల్లో పంట నష్టం | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో 336ఎకరాల్లో పంట నష్టం

Mar 23 2025 9:10 AM | Updated on Mar 23 2025 9:05 AM

కరీంనగర్‌ అర్బన్‌: అకాల వర్షం అన్నదాతకు నష్టాన్ని తెస్తోంది. శుక్రవారం జిల్లావ్యాప్తంగా వర్షం కురియగా వ్యవసాయశాఖ నష్ట మ దింపు చేపట్టింది. 13 గ్రా మాల్లోని వరి, మొక్కజొన్న పంటలకు నష్టం జరిగిందని ప్రాథఽమికంగా గుర్తించారు. 33శాతం పంట నష్టం నిబంధన క్రమంలో ప్రాథమిక కసరత్తు చేపట్టారు. ఎక్కువగా చొప్పదండి, రామడుగు, కరీంనగర్‌ రూరల్‌, కొత్తపల్లి జిల్లాల్లో నష్టం వాటిల్లింది. జిల్లాలోని ముగ్ధుంపూర్‌(కరీంనగర్‌ రూరల్‌), కొత్తపల్లి, నాగులమల్యాల(కొత్తపల్లి), చర్లబూత్కూర్‌(కరీంనగర్‌ రూరల్‌), ఇరుకుల్ల(కరీంనగర్‌ రూరల్‌), నగునూరు(కరీంనగర్‌ రూరల్‌), చామనపల్లి(కరీంనగర్‌ రూరల్‌), గోపాల్‌పూర్‌(కరీంనగర్‌ రూరల్‌), కాట్నపల్లి(చొప్పదండి), రుక్మాపూర్‌(చొప్పదండి), వెలిచాల(రామడుగు), వన్నారం(రామడుగు), గోపాల్‌రావుపేట(రామడుగు)లో వరి, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లిందని డీఏవో భాగ్యలక్ష్మి వివరించారు. వరి 15 ఎకరాల్లో నష్టం వాటిల్లగా, మొక్కజొన్నకు 321 ఎకరాల్లో నష్టం వాటిల్లిందని వెల్లడించారు. వరి 15 ఎకరాలకు గానూ ఏడుగురు పంట నష్టపోయారని, మొక్కజొన్న 321 ఎకరాలకు గానూ 206 మంది రైతులు నష్టపోయారని వివరించారు. సదరు ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి నివేదించినట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement