శంకరపట్నం: మండలంలోని ముత్తారం గ్రామంలో సోమవారం ఇంటర్ విద్యార్థిని ఆర్టీసీ బస్సులో నుంచి కిందపడడతంతో తీవ్రగాయాలు అయ్యాయి. ముత్తారం గ్రామానికి చెందిన మేఘన కరీంనగర్లో ఇంటర్ పరీక్షలు రాసి బస్సులో స్వగ్రామానికి వస్తుండగా ముత్తారం గ్రామ మూలమలుపు వద్ద డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో మేఘన బస్సు నుంచి కిందపడింది. తీవ్రంగా గాయపడ్డ ఆమెను కుటుంబసభ్యులు చికిత్స కోసం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
మండలంలోని కొత్తగట్టు గ్రామశివారులో జరిగిన మరో ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. మొలంగూర్ గ్రామానికి చెందిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దండు కొమురయ్య మోటర్సైకిల్పై వెళ్తుండగా పెద్దపల్లి జిల్లాకు చెందిన డానియల్ బైక్ వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కొమురయ్య, డానియల్కు గాయాలయ్యాయి. అయితే ఇదే సమయంలో వరంగల్ వెళ్తున్న అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత ఘటన స్థలం వద్ద తనకారు ఆపి క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.