ధర్పల్లి: మండలంలోని హోన్నాజీపేట్ గ్రామంలో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నిజామాబాద్ ఏసీపీ ప్రకాశ్ శనివారం విచారణ చేపట్టారు. గ్రామానికి వెళ్లి బాధితులు, గ్రామస్తులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా కొనసాగుతుందన్నారు. చట్టానికి విరుద్ధంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతకుముందు ధర్పల్లి మండల కేంద్రంలో ఈ నెల 11న జరిగిన జారూపల కాంతామణి హత్య కేసుకు సంబంధించి ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. ఏసీపీ వెంట సీఐ భిక్షపతి, ఎస్సై శ్రీనివాస్, సిబ్బంది ఉన్నారు.


