
ఆస్పత్రుల పాలైతేనే చర్యలు..
అన్ని కులవృత్తుల్లానే కల్లు గీత వృత్తి కూడా నిరాదరణకు
గురవుతోంది. ప్రధానంగా యువతరం ఈ వృత్తికి దూరంగా
ఉంటున్నారు. దీంతో కల్లు గీసేవారు కరువై స్వచ్ఛమైన
కల్లు దొరకకుండా పోతోంది. కల్తీ కల్లు మాత్రం
విరివిగా లభిస్తోంది. ఎకై ్సజ్ అధికారులు సైతం
పట్టించుకోకపోవడంతో కల్తీ కల్లు తయారీ,
విక్రయాలు యథేచ్ఛగా
సాగుతున్నాయన్న
ఆరోపణలున్నాయి.
● వృత్తికి దూరమవుతున్న యువతరం
● చెట్లెక్కి కల్లు గీసేవారు కరువు..
● పెరిగిన కృత్రిమ కల్లు తయారీ
● పట్టించుకోని ఎకై ్సజ్ అధికారులు
కామారెడ్డి క్రైం : గతంలో గ్రామ శివారు ప్రాంతాల్లో ఉండే ఈత వనాలకు వెళ్లి చెట్లను గీసి కల్లు తీసేవారు. ఆ కల్లును తెచ్చి అమ్మేవారు. సరైన ఆదరణ లేక కల్లు గీత వృత్తి చాలా రోజులుగా తగ్గుతూ వస్తోంది. ఓవైపు కొంత కాలంగా కల్లుగీసేవారు తగ్గిపోతున్నా.. మరోవైపు గ్రామాలు, పట్టణాల్లో కల్లు దుకాణాల సంఖ్య మాత్రం రోజురోజుకూ పెరుగుతుండడం గమనార్హం. కొంతమంది ఒక్క చుక్క కూడా స్వచ్ఛమైన కల్లు లేకుండానే వేల లీటర్ల కల్లు తయారు చేస్తున్నారు. కల్లు తయారీలో పోటీలు పడి మరీ మత్తు పదార్థాలు వాడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
కృత్రిమ కల్లే దిక్కు..
పొద్దంతా శ్రమించే వారు సాయంత్రం కాగానే అలసటను తీర్చుకోవడం కోసం కల్లు సేవిస్తుంటారు. కొంతమంది రోజూ కల్లు తాగుతుంటారు. ఇది చాలామందికి అలవాటుగా కూడా మారింది. కల్లు లేకపోతే పిచ్చిగా ప్రవర్తించే ప్రమాదకర పరిస్థితులను చూస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ నిత్యం కల్లు విక్రమాలు జరుగుతున్నాయి. అయితే చాలాచోట్ల స్వచ్ఛమైన కల్లు అనేది మచ్చుకై నా కనిపించడం లేదు. అంతా మత్తు పదార్థాలను కలిపి తయారు చేసిన కృత్రిమ కల్లే అందుబాటులో ఉంటోంది. ఈ కల్లుకు అలవాటు పడినవారి పరిస్థితి దారుణంగా మారుతోంది. ఇటీవల దుర్కి అంకోల్, దామరంచ రాంపూర్, సంగెం, గౌరారం గ్రామాలకు చెందిన 83 మంది ప్రజలు కల్తీ కల్లు కారణంగా ఆస్పత్రుల పాలైన విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రమే ఎకై ్సజ్ అధికారులు హడావుడి చేస్తారని, మిగతా సమయాల్లో కల్తీ కల్లు ఏరులై పారుతున్నా పట్టించుకోరనే విమర్శలు వినిపిస్తున్నాయి.
జిల్లాలో ఇటీవల వెలుగు చూసిన కల్తీ కల్లు వ్యవహారాన్ని కలెక్టర్తో పాటు మొత్తం జిల్లా యంత్రాంగం సీరియస్గా తీసుకుంది. బాధితులకు వైద్యం అందించడంతో పాటు ఘటనకు కారణాలపై ఆరా తీయడం మొదలు పెట్టి కల్లు త యారు చేసిన డిపో యజమానులు సురేందర్, అంజాగౌడ్లపై కేసులు నమోదు చేశారు. జిల్లావ్యాప్తంగా 173 చోట్ల కల్లు దుకాణాల్లో తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో మరో 32 కల్తీ కల్లు విక్రయిస్తున్న కేసులు నమోదు చేసి 28 మంది కల్తీ కల్లు విక్రయదారులను అరెస్ట్ చేశారు. 50 గ్రా ముల అల్ఫ్రాజోలం పట్టుబడింది. మరో 150 శాంపిళ్లు సేకరించారు. కల్లు తయారీలో అల్ప్రా జోలం వినియోగించినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. నిందితులు పరారీలో ఉండడంతో కల్లు తయారీలో వినియోగించిన డోసు విషయంలో స్పష్టత రాలేదు. కల్తీ కల్లు వ్యవహారం ఎప్పట్నుంచో నడుస్తున్నదే కానీ దుర్ఘటన ఏదైనా జరిగినప్పుడు మాత్రమే అధికారులు చర్యలకు ఉపక్రమిస్తున్నారనే విమర్శలున్నాయి.
ఈత వనాలపై నిర్లక్ష్యం..
కల్తీ కల్లును అరికట్టడం దేవుడెరుగు, స్వచ్ఛమైన కల్లు తయారీని ప్రోత్సహించే విషయంలోనూ సరైన చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. కల్లు గీత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు స్వచ్ఛమైన కల్లును ప్రోత్సహించే ఉద్దేశంతో ఉపాధి హామీ పథకం, హరిత హారంలలో భాగంగా జిల్లాలోని అన్ని మండలాల పరిధిలో ఈత వనాలు ఏర్పాటు చేశారు. అయితే అధికారుల నిర్లక్ష్యం, నిర్వహణ లోపాల కారణంగా చాలాచోట్ల నాటిన మొక్కలు ఎండిపోయాయి. దీంతో నిధులు వృథా అయ్యాయి. ఇందులో కూడా ఎకై ్సజ్ శాఖ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్ని చెట్లు పెట్టారు, ఎన్ని ఉన్నాయి, ఎన్ని వృథాగా పోయాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఈత వనాలు పెంపకంపై దృష్టి సారించి స్వచ్ఛమైన కల్లు దొరికేలా అధికారులు చర్యలు చేపట్టాలని కల్లు ప్రియులు కోరుతున్నారు.
కల్తీ కల్లు విక్రయిస్తే చర్యలు తప్పవు
జిల్లాలో కల్తీ కల్లు విషయంలో క్రమం తప్పకుండా తని ఖీలు చేస్తున్నాం. కల్తీ కల్లు వల్ల దుష్పరిణామాలపై అవగాహన కల్పిస్తున్నాం. మత్తు పదార్థాలపై నిఘా పెట్టాం. కల్తీ కల్లు విక్రయిస్తే చర్యలు తప్పవు.
– హన్మంతరావు, ఎక్సైజ్ సూపరింటెండెంట్

ఆస్పత్రుల పాలైతేనే చర్యలు..