వర్షాలు లేకపోవడం, బోరులో నీరు తగ్గిపోవడంతో ఈసారి ఉల్లి కొంత ఆలస్యంగా వేశాం. వచ్చే నెలాఖరుకు పంట చేతికి వస్తుంది. అయితే ప్రస్తుతం ఉల్లిగడ్డకు ఉన్న ధరలు మా పంటలు చేతికి వచ్చిన తర్వాత ఉండవు. మూడేళ్ల క్రితం కూడా ఇలాగే జరిగింది. ఇప్పుడు ధరలు పెరగడం వల్ల వ్యాపారులకే లాభం.
– సూరి, ఉల్లి రైతు, గద్వాల
ఎల్నినో కారణంగానే..
ఎల్నినో ప్రభావంతో వర్షాలు కురవక.. భూగర్భజలాలు తగ్గిపోయాయి. దీంతో గడిచిన వానాకాలం సీజన్తో పోల్చితే ఈసారి ఉల్లి సాగు తగ్గింది. దీనికితోడు వర్షాభావ పరిస్థితులతో ఈసారి ఉల్లి కాస్త ఆలస్యంగా వేశారు. సెప్టెంబర్ రెండు, మూడో వారం నుంచి జిల్లాలో ఉల్లి చేతికి వస్తుంది. స్థానికంగా ఉత్పత్తులు చేతికి వస్తేనే ధర తగ్గి, నియంత్రణలో ఉంటుంది.
– రాజ్కుమార్, జిల్లా ఉద్యాన శాఖాధికారి


