రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. మద్యం మత్తులో జరిగే ప్రమాదాలపై ప్రత్యేక దృష్టిసారించి విచారణ చేపడుతాం. ఇటీవల చోటు చేసుకున్న ప్రమాదాలపై ఆరా తీస్తున్నాం. మద్యం తాగి వాహనాలు నడపడం మంచిది కాదు. అలా వాహనాలు నడిపే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతోపాటు శాశ్వతంగా లైసెన్స్ రద్దు చేస్తాం. జిల్లావ్యాప్తంగా ప్రతిరోజు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. తనిఖీలు చేస్తున్న క్రమంలో కొందరు తప్పించుకునేందుకు అడ్డదారుల్లో వెళ్తున్నారు. ప్రజల భద్రత కోసం నిర్విరామంగా సిబ్బంది విధుల్లో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. – శ్రీనివాసరావు, ఎస్పీ
●


