గద్వాల క్రైం: ప్రభుత్వం రోడ్డు ప్రమాదాల నివారణకు వీలైనంత వరకు వాహనదారుల్లో మార్పునకు కృషి చేస్తుంది. ప్రమాదవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదం వేరు.. మత్తులో తూగుతూ ప్రమాదానికి గురైన సంఘటనలే జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకుంటున్నాయి. గత నెల 26న ఓ వ్యక్తి తన స్నేహితులతో కలిసి మద్యం పార్టీ చేసుకున్నారు. ఆ తర్వాత మత్తులో కారు నడుపుతూ ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో ఎదురుగా వచ్చే వాహనాలను గుర్తించలేనంత వేగంగా నడుపుతూ ఎడమ వైపు వస్తున్న ఓ బైక్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో వలస వచ్చిన ఓ యువకుడు అక్కడికక్కడే తల పగిలి మృతిచెందాడు. ప్రమాదం తర్వాత సదరు వ్యక్తి కారు ఆపకుండా అంతే వేగంగా వెళ్లిపోవడం హాట్టాపిక్గా మారింది. దీంతో ఈ నెల 2న ఎస్పీ శ్రీనివాసరావు అర్ధరాత్రి ఆకస్మికంగా వాహనాల తనిఖీ చేపట్టడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
జిల్లాలో అత్యధికంగా ఈ కోవలోనే రోడ్డు ప్రమాదాలు
తనిఖీల నుంచి తప్పించుకునే క్రమంలో కొందరు వాహనదారులు
పోలీసులు అవగాహన కల్పిస్తున్నా కనిపించని మార్పు
స్వయంగా అర్ధరాత్రి వాహనాల తనిఖీ చేపట్టిన ఎస్పీ
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పటిష్ట చర్యలు


