ఆర్డీఎస్ కెనాల్లో సాగునీటిపై ఆశలు పెట్టుకున్న ప్రతిసారి నిరాశే ఎదురవుతుంది. ఏ ఈడాది నీరు వస్తాయనుకునే సరికి ఏదో రకంగా నీటి విడుదలకు బ్రేక్ పడుతుంది. మేము ఉన్న సమయంలో ఆర్డీఎస్ ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ముగ్గురు సీఎంలు కలిసి కూడా ఏదీ స్పష్టత రాలేదు. – నాగార్జున, రైతు, ఉండవెల్లి
ప్రాజెక్టులను నిలిపేయాలి
కర్ణాటకలో తుంగభద్ర నదిపై కడుతున్న అక్రమ ప్రాజెక్టులను వెంటనే నిలిపేయాలి. ఆర్డీఎస్ రైతుల కోసం నిర్మించిన తుమ్మిళ్ల లిఫ్టు పూర్తి కాలేదు. అప్పుడే వారు నీటిని దిగువకు రానివ్వకుండా అక్రమ ప్రాజెక్టులు నిర్మించి పూర్తిచేసే స్థాయికి వచ్చినా మన ప్రభుత్వం ఏమి చేస్తున్నట్లు. వెంటనే మల్లమ్మకుంట నిర్మించడంతో పాటు, కర్ణాటకలోని కురిడిలో నిర్మిస్తున్న ప్రాజెక్టును నిలిపేయాలి. – మధుసూదన్గౌడ్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు


