ప్రకృతి సేద్యం దిశగా.. | - | Sakshi
Sakshi News home page

ప్రకృతి సేద్యం దిశగా..

Jan 7 2026 7:35 AM | Updated on Jan 7 2026 7:35 AM

ప్రకృ

ప్రకృతి సేద్యం దిశగా..

సేంద్రియ వ్యవసాయానికి కేంద్రం ప్రోత్సాహం

గద్వాలవ్యవసాయం: సుస్థిర వ్యవసాయం దిశగా అడుగులు పడేలా కేంద్రం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా నేషనల్‌ మిషన్‌ ఆన్‌ న్యాచురల్‌ ఫార్మింగ్‌ (ఎన్‌ఎంఎన్‌ఎఫ్‌) ద్వారా ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిస్తోంది. రసాయనిక ఎరువులు, పురుగు మందులు ఏమాత్రం వినియోగించకుండా ప్రకృతి సిద్ధమైన బీజామృతం, జీవామృతం, ఆచ్చాదన తదితర పద్ధతులతో ప్రకృతి వ్యవసాయం చేసేందుకు గాను జిల్లాలో 40 మంది కృషి సఖిలను వ్యవసాయశాఖ నియమించింది. వీరికి ప్రకృతి వ్యవసాయంపై పూర్తి శిక్షణ అందించి.. ఎంపిక చేసిన క్లస్టర్లలో పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో 2,500 ఎకరాల్లో పంటలు పండించాలని ప్రణాళికలు రూపొందించింది. ప్రకృతి వ్యవసాయంతో నేల ఆరోగ్యంగా ఉండటంతో పాటు భూ సారం పెరుగుతుంది. పెట్టుబడులు సైతం తక్కువ అవుతాయి. పంట ఉత్పత్తులు నాణ్యతగా ఉండి.. ఆరోగ్యకరమైన ఆహారం లభిస్తుంది. పండించిన పంట ఉత్పత్తులతో రైతులకు మంచి ధరలు లభిస్తాయి. గాలి, నీరు, భూమి కలుషితం కాకుండా పర్యావరణం పరిరక్షించబడుతుంది.

మండలం క్లస్టర్లు ఎకరాలు

అలంపూర్‌ 2 250

ధరూర్‌ 2 250

గద్వాల 2 250

గట్టు 1 125

అయిజ 2 250

కేటీదొడ్డి 1 125

ఇటిక్యాల 1 125

ఎర్రవల్లి 2 250

మల్దకల్‌ 2 250

మానవపాడు 2 250

రాజోళి 1 125

ఉండవెల్లి 1 125

వడ్డేపల్లి 1 125

జిల్లాలో మండలాల వారీగా ప్రకృతి సేద్యం ఇలా..

జిల్లాలో మొదటి విడతగా 2,500 ఎకరాల్లో సాగు లక్ష్యం

ఎన్‌ఎంఎన్‌ఎఫ్‌ ద్వారా 40 మంది కృషి సఖిల నియామకం

పూర్తి శిక్షణ అందిస్తున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు

ప్రకృతి సేద్యం దిశగా.. 1
1/1

ప్రకృతి సేద్యం దిశగా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement