ఢిల్లీకి చేరిన పంచాయితీ..
చిన్నోనిపల్లె రిజర్వాయర్ను రద్దు చేయాలని కోరుతూ.. దీక్ష చేస్తున్న నిర్వాసితుల రైతులకు ప్రతిపక్షాలకు చెందిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, సీపీఐ, సీపీఎంలకు చెందిన రాష్ట్ర నాయకులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రంతోపాటు మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి, కాంగ్రెస్, బీఎల్ఎఫ్ పార్టీలకు చెందిన జిల్లా నాయకులు, ప్రజాసంఘాల నాయకులు బాసటగా నిలిచారు. రైతుల డిమాండ్ మేరకు రిజర్వాయర్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరి 30న ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నిర్వాసిత రైతులు నిరసన దీక్ష చేపట్టారు. వీరికి తెలంగాణ జన సమితి అధ్యక్షుడ, ప్రొఫెసర్ కోదండరాం మద్దతు తెలిపారు.