● ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
భూపాలపల్లి: ప్రజల సమస్యలకు పరిష్కారమే లక్ష్యంగా ప్రజాదివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదివస్ కార్యక్రమంలో 19మంది నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. మండలస్థాయిలో పరిష్కారం కాని సమస్యలను తమ దృష్టికి తీసుకరావాలని సూచించారు. పోలీస్స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల పోలీసు అధికారులు మర్యాదగా వ్యవహరించాలని, చట్టబద్ధంగా సమస్యలు పరిష్కరించాలని ఎస్పీ సంకీర్త్ సూచించారు.


