తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ మధ్య రాకపోకలు బంద్‌ | - | Sakshi
Sakshi News home page

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ మధ్య రాకపోకలు బంద్‌

Aug 20 2025 5:13 AM | Updated on Aug 20 2025 5:13 AM

తెలంగ

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ మధ్య రాకపోకలు బంద్‌

వాజేడు: మండల పరిధిలోని టేకులగూడెం గ్రామ సమీపంలో 163నంబర్‌ జాతీయ రహదారిపైకి మంగళవారం గోదావరి వరద వచ్చి చేరింది. దీంతో తెలంగాణ– ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల మధ్యన రాక పోకలు నిలిచిపోయాయి. గోదావరి వరద క్రమేపీ పెరుగు తుండటంతో రేగుమాకు ఒర్రె నుంచి రహదారిపైకి వరద నీరు వచ్చి చేరింది. అప్రమత్తమైన అధికారులు వరదలోకి వెళ్లకూడదని హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. అధికారులు వరద పరిస్థితిని పరిశీలించారు. ముంపునకు గురైన జాతీయ రహదారిని వెంకటాపురం(కె) సీఐ ముత్యం రమేష్‌, పేరూరు ఎస్సై కృష్ణ ప్రసాద్‌, తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఎంపీడీఓ శ్రీకాంత్‌ నాయుడు పరిశీలించారు. వాహనదారులు నీటిలో నుంచి వెళ్లకుండా భారీకేడ్లను ఏర్పాటు చేశారు. పలువురు గోదావరి వరద జాతీయ రహదారిని ముంచిన విషయం తెలియక అక్కడికి చేరుకున్న రెండు రాష్ట్రాల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. లగేజీ మోసుకుంటూ వరదలో నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు. అదే సమయంలో ఓ లారీ వరదలో నుంచి రావడంతో దాని పక్క నుంచి ద్విచక్రవాహనాలను దాటించారు.

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ మధ్య రాకపోకలు బంద్‌ 1
1/2

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ మధ్య రాకపోకలు బంద్‌

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ మధ్య రాకపోకలు బంద్‌ 2
2/2

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ మధ్య రాకపోకలు బంద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement