మహాజాతరకు.. నిధుల వరద | - | Sakshi
Sakshi News home page

మహాజాతరకు.. నిధుల వరద

Aug 21 2025 6:48 AM | Updated on Aug 21 2025 7:22 AM

మహాజాతరకు.. నిధుల వరద

‘మేడారం–2026’ నిర్వహణకు రూ.150 కోట్లు

సాక్షిప్రతినిధి, వరంగల్‌/ఏటూరునాగారం: వచ్చే ఏడాది జరగనున్న తెలంగాణ కుంభమేళా, సమ్మక్క, సారలమ్మల మేడారం మహాజాతరకు భారీగా నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతీ రెండేళ్లకోసారి జరిగే ఈ మహాజాతరకు గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.150 కోట్లు మంజూరు చేస్తూ శాఖలవారీగా బడ్జెట్‌ను కేటాయించింది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు సైతం జారీ చేసింది. భారీగా నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, గిరిజన సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌లకు రాష్ట్ర సీ్త్ర శిశుసంక్షేమ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ధనసరి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు.

ఇతర రాష్ట్రాలనుంచి భక్తుల రాక

మేడారం జాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నుంచే కాకుండా ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఈ క్రమంలోనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు.

గత ఏడాది రూ.110కోట్లు

గత ఏడాది 2024 మహాజాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.110కోట్లు మంజూరు చేసి మేడారంలో పలు అభివృద్ధి పనులు చేసింది. జాతరలో భక్తుల సౌకర్యాలను మరింత పెంచేందుకు ఈసారి అదనంగా రూ.40 కోట్లు పెంచి రూ.150కోట్లు చేయడం గమనార్హం. 2022లో అప్పటి ప్రభుత్వం రూ.75 కోట్లను మేడారం జాతర నిర్వహణకు మంజూరు చేసింది.

నిధులు మంజూరు చేస్తూ

రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు

గత ఏడాది రూ.110కోట్లే

సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులకు మంత్రి సీతక్క ధన్యవాదాలు

శాఖల వారీగా నిధులు కేటాయింపు

2026 జనవరిలో

తెలంగాణ కుంభమేళా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement