
సమస్యలు పరిష్కరించాలి
భూపాలపల్లి అర్బన్: సింగరేణికి చెందిన కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఎంఓఐ) అధికారుల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్ది నారసింహులు డిమాండ్ చేశారు. ఏరియాలో సింగరేణి గెస్ట్హౌస్లో భూపాలపల్లి బ్రాంచ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని ఏరియాల అధికారుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పెద్ది నారసింహులు హాజరై మాట్లాడారు. పర్మార్మెన్స్ రిలేటెడ్ పే (పీఆర్పీ) అంశం ప్రధాన ఎజెండాగా నిలిచిందన్నారు. అధికారుల సమస్యల పరిష్కారానికి ఆందోళనలు చేపట్టనట్లు తెలిపారు. ఈ నెల 31న నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీఎంఓఐ నాయకులు లక్ష్మిపతి, నజీర్ పాల్గొన్నారు.