
జాతీయ రహదారిపై దుర్శెన చెట్టే దిక్కు..
పక్క ఫొటోలో కనిపిస్తున్నది రేగొండ మండల కేంద్రం. చిట్యాల, టేకుమట్ల, గోరికొత్తపల్లి మండలాలకు చెందిన వారు వివిధ పనుల నిమిత్తం ఈ సెంటర్ మీదుగా రాకపోకలు సాగిస్తుంటారు. జాతీయ రహదారిలో రేగొండ మండల కేంద్రం ఉంటుంది. నిత్యం వందలాది మంది రాకపోకలు సాగించే ఇక్కడ బస్టాండ్ లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోలీస్స్టేషన్ పక్కనే ఉన్న దుర్శెన చెట్టు కింద నిలబడి తమ రాకపోకలను సాగిస్తున్నారు. సమీపంలోనే చెరువు శిఖం భూమి, ప్రైవేట్ స్థలాలు ఉన్నాయి. ప్రజాప్రతినిధులు తలుచుకుంటే బస్టాండ్ నిర్మాణం జరిగే అవకాశం ఉంది. అయినప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడం లేదు.