మహాముత్తారం అడవిలో పులి కలకలం | - | Sakshi
Sakshi News home page

మహాముత్తారం అడవిలో పులి కలకలం

Apr 17 2025 1:25 AM | Updated on Apr 17 2025 3:46 PM

కాటారం: మహాముత్తారం మండలంలో పులి సంచారం కలకలం సృష్టిస్తుంది. పులి అటవీ ప్రాంతంలోకి వచ్చిందనే పుకార్లతో అటవీ సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కాగా స్తంభంపల్లి(పీకే), మద్దిమడుగు గ్రామాల మధ్య గల అటవీ ప్రాంతంలో పులి అడుగులను అటువైపు వెళ్లిన పలువురు గుర్తించారు. సమాచారం అందుకున్న దూదేకులపల్లి రేంజర్‌ రాంమూర్తి ఆధ్వర్యంలో సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని పులి పాదముద్రలు (ప్లగ్‌ మార్క్స్‌)ను నిర్ధారించారు. కానీ, అవి తాజా పాదముద్రలు కావని.. నాలుగు రోజుల క్రితం పులి ఇటువైపుగా వెళ్లినట్లుగా ఉన్నాయని రేంజర్‌ తెలిపారు.

అగ్నిప్రమాదాలపై ఆస్పత్రుల్లో అవగాహన

భూపాలపల్లి అర్బన్‌: అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా బుధవారం మూడో రోజు జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారణ చర్యలపై మాక్‌డ్రిల్‌ చేపట్టారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది నరేందర్‌, సురేష్‌, కల్యాణ్‌, నవీన్‌కుమార్‌, వెంకటయ్య పాల్గొన్నారు.

రజతోత్సవ సభను విజయవంతం చేయాలి
భూపాలపల్లి అర్బన్‌: ఈ నెల 27న హనుమకొండలో నిర్వహించనున్న బీఆర్‌ఎస్‌ పార్టీ రజతోత్సవ వేడుకలను పార్టీ నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం మున్సిపాలిటీ పరిధీలోని జంగేడు, వేశాలపల్లి, పెద్దకుంటపల్లి, కాశీంపల్లి, సెగ్గంపల్లి, గడ్డిగానిపల్లి ఆకుదారివాడల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో పాల్గొని వెంకటరమణా రెడ్డి మాట్లాడారు. బహిరంగ సభకు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. సమావేశంలో మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ వెంకటరాణిసిద్దు, పీఏసీఎస్‌ చైర్మన్‌ మేకల సంపత్‌కుమార్‌, నాయకులు జనార్ధన్‌, రాజులు పాల్గొన్నారు.

చట్టాలను నిర్వీర్యం చేసే కుట్ర
భూపాలపల్లి అర్బన్‌: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తుందని, దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు తుమ్మల రాజిరెడ్డి, మంద నరసింహరావు డిమాండ్‌ చేశారు. ఏరియాలోని సింగరేణి గెస్ట్‌హౌజ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా మే 20వ తేదీన దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. బీజేపీ, బీఎంఎస్‌లు మినహా ఇతర పార్టీలు, సంఘాలు సమ్మెలో పాల్గొంటున్నట్లు తెలిపారు. 51 శాతం మంది కార్మికులు సమ్మెను అంగీకరిస్తేనే సమ్మె చేయాలని, సీఎంపీఎఫ్‌ కాంట్రీబ్యూషన్‌ 12 శాతం నుంచి 10 శాతానికి తగ్గించడం. 12 గంటలకు పని వేళలను పెంచడం, లేబర్‌ ఇన్‌స్పెక్టర్‌ను ఫెసిలిటేటర్‌గా మార్చడం వంటి చర్యలను మానుకోవాలని డిమాండ్‌ చేశారు. 

అప్రెంటీస్‌ విధానం ద్వారా కార్మికులను నియమించుకుంటూ వారితో ఏళ్ల తరబడి పనులు చేయిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం సింగరేణి సంస్థను నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. సంస్థకు రావాల్సిన బాకాయిలను చెల్లించడం లేదని, సింగరేణికి ప్రైవేట్‌ గనులను అప్పగించాలని ఎటువంటి పోరాటం చేయడం లేదన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్‌ను పరిష్కరించడం లేదని తెలిపారు. ఐదేళ్ల తర్వా త జరిగిన స్ట్రక్చర్‌ కమిటీ సమావేశంలో సీఎండీ పాల్గొనకపోవడం హాస్యస్పాదమన్నారు. గు ర్తింపు సంఘం యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లిన సమస్యలను పరిష్కరించకుండా కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నట్లు తెలిపారు. సింగరేణి కార్మికులకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో కంపేటి రాజయ్య, రమేష్‌, శివరాంరెడ్డి, ప్రవీణ్‌కుమార్‌, రవి, దినేష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement