● జూనియర్ సివిల్ జెడ్జి సందీప
జనగామ రూరల్: విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిస కావొద్దని జూనియర్ సివిల్ జడ్జి సందీప సూచించారు. బుధవారం పట్టణంలో పసరమడ్ల స్టేజీ వద్ద ఉన్న గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. ఎవరైనా డ్రగ్స్ విక్రయించడం, వాడడం గమనిస్తే 100 లేదా 1933 నంబర్కు సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఒ.లచ్చిరామ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


