సమస్యల పరిష్కారమేది? | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారమేది?

Aug 19 2025 5:16 AM | Updated on Aug 19 2025 5:16 AM

సమస్యల పరిష్కారమేది?

సమస్యల పరిష్కారమేది?

గ్రీవెన్స్‌లో బాధితుల మొర

జనగామ రూరల్‌: ప్రజావాణిలో ఇచ్చిన దరఖాస్తులకు మోక్షమెప్పుడోనని బాధితులు వాపోతున్నా రు. సోమవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణికి జిల్లాలోని పలు ప్రాంతా ల నుంచి బాధితులు వినతులు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా అదనపు కలెక్టర్‌ పింకేష్‌కుమార్‌, ఉన్నతాధికారులతో కలిసి వినతులు స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన స మావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రీవెన్స్‌లో వచ్చి న వినతులు సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మొత్తం 34 వినతులు రాగా ఆయా శాఖల అధికారులకు ఎండార్స్‌ చేశారు.

వినతులు కొన్ని ఇలా..

● జనగామ మండలం చౌడారం గ్రామానికి చెందిన యాసారపు రవికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని విన్నవించారు.

● చిల్పూరు మండలం పల్లగుట్టకు చెందిన దారా ఝాన్సీ డబల్‌ బెడ్‌ రూం ఇల్లు మంజూరు చేయాలని కోరారు.

● దేవరుప్పుల మండలం రామచంద్రాపురం గ్రామంలో 2022–23 సంవత్సరంలో నిర్మించిన డ్రెయినేజీ నాసిరకం పనులతో నిర్మించారని, నాణ్యతప్రమాణాలు పరిశీలించి చర్య తీసుకోవాలని సుధాకర్‌రెడ్డి, ఇన్నారెడ్డి, రమేశ్‌, ఆంజనేయులు ఫిర్యాదు చేశారు.

● జనగామ, పాలకుర్తి రహదారిలోని పటేల్‌ గూడెం వాగు వద్ద నిర్మిస్తున్న బ్రిడ్జి అప్రోచ్‌ రోడ్డు పెండింగ్‌ పనులు వెంటనే పూర్తి చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చిర్ర వీరస్వామి కలెక్టర్‌కు వినతి అందించారు.

● నీర్మాల గ్రామానికి చెందిన మేడ కల్పనకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఆదుకోవాలని వినతి అందించింది.

వినతులు తక్షణమే పరిష్కరించాలి

కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా

ప్రజావాణికి 34 అర్జీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement