జగిత్యాల: జిల్లాలోని దేవాదాయశాఖకు సంబంధించిన భూములను 22ఏ నిషేధిత జాబితాలో చే ర్చే ప్రక్రియను జాగ్రత్తగా, తప్పిదాలు లేకుండా పూ ర్తి చేయాలని అదనపు కలెక్టర్ లత అన్నారు. 22ఏ నిషేధిత భూములపై సమీక్షించారు. ఆలయ భూ ములు, సర్వే నంబర్లు, ఉప విభాగ సంఖ్యలు, విస్తీర్ణం, భూమి వర్గీకరణ, యాజమాన్య వివరాలు, రెవెన్యూ, దేవాదాయ శాఖ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఖరారు చేయాలన్నారు. దేవా దాయ శాఖ ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, గడువులోపు సమగ్రంగా పరిశీలించి జాబితాను సిద్ధం చేయాలని సూచించారు.


