జగిత్యాలరూరల్: భారీవర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. బుధవారం సాయంత్రం జగిత్యాలరూరల్ మండలం అనంతారం, గుల్లపేటలో వాగు ప్రవాహాన్ని పరిశీలించారు. రెవెన్యూ, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అధికారులు ముందస్తు అనుమతి లేకుండా కార్యాలయాలను విడిచి వెళ్లొద్దన్నారు. నీటి ముంపు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ హకీం, ఎంపీడీవో రమాదేవి, ఆర్ఐ శంషోద్దీన్ పాల్గొన్నారు.


