
క్రిమిసంహారక మందు తాగి యువకుడి బలవన్మరణం
వెల్గటూర్: కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెందిన ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలోని ఎండపల్లిలో వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. గొల్లపల్లి మండలం దమ్మన్నపేటకు చెందిన అంగడి రాజు (26)కు కొంతకాలంగా భార్యతో గొడవలు జరుగుతున్నాయి. గురువారం కూడా గొడవ కాగా ఇంటినుంచి వెళ్లిపోయాడు. ఎండపల్లి శివారులో క్రిమి సంహారక మందు తాగాడు. చుట్టుపక్కల వారు సమాచారం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. రాజు తండ్రి చంద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉమాసాగర్ తెలిపారు.
ధర్మపురి: మేకలను మేపేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు కెనాల్లో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన దోనూర్లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. దోనూరుకు చెందిన మాసం చంద్రయ్య (59) ఎప్పటిలాగే శనివారం మేకలను మేపేందుకు వెళ్లాడు. సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండగా గ్రామ శివారులోని భీమన్న గుట్ట వద్ద ప్రమాదవశాత్తు ఎస్సారెస్పీ చిన్న కాలువలో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. చంద్రయ్యకు భార్య నర్సవ్వ, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. నర్సవ్వ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉదయ్కుమార్ తెలిపారు.
నృసింహుడి సన్నిధిలో మాజీ ఎమ్మెల్యే
ధర్మపురి: శ్రీలక్ష్మినృసింహస్వామి వారిని నిజా మాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా శనివారం దర్శించుకున్నారు. ట్రస్ట్బోర్డు చైర్మన్ జక్కు రవీందర్, ఈవో శ్రీనివాస్ ఆయనకు స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలు అందించా రు. బీఆర్ఎస్ హయాంలో మాజీ సీఎం కేసీఆర్ ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేశారని, గోదావరి పుష్కరాలను ఎంతో వైభవంగా నిర్వహించారని అన్నారు. ఆలయ అర్చకులు, సిబ్బంది, ధర్మకర్తల మండలి సభ్యులు తదితరులున్నారు.
జ్యోతినగర్: ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు లేబర్ గేట్ సమీపంలోని రాజీవ్ రహదారిపై రెండు ద్విచక్రవాహనాలు ఢీకొనగా నలుగురికి గాయాలయ్యాయి. న్యూపీకేరామయ్య కాలనీకి చెందిన రాధారపు గట్టయ్య టీవీఎస్ వాహనంపై ప్రాజెక్టు లేబర్ గేట్ నుంచి మెయిన్ రోడ్కు వస్తుండగా మంథని ప్రాంతానికి చెందిన ముగ్గురు మరో బైక్పై వేగంగా వచ్చి గట్టయ్య వాహనాన్ని ఢీ కొట్టారు. గట్టయ్యతో పాటు మంథని కౌశిక్, బూడిద మనోజ్, బూడిద సాయి మనోహర్కు గాయాలయ్యాయి.

క్రిమిసంహారక మందు తాగి యువకుడి బలవన్మరణం