పలువురు జడ్జీల బదిలీ | - | Sakshi
Sakshi News home page

పలువురు జడ్జీల బదిలీ

Apr 26 2025 12:07 AM | Updated on Apr 26 2025 12:07 AM

పలువు

పలువురు జడ్జీల బదిలీ

జగిత్యాలజోన్‌: జిల్లాలోని పలు కోర్టుల్లో జడ్జీ లను బదిలీ చేస్తూ రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. జగిత్యాల మొదటి అదనపు జడ్జిగా కొనసాగుతున్న తౌటం జితేందర్‌ను సిద్దిపేట జిల్లా దుబ్బాకకు, జగిత్యాల రెండో అదనపు జడ్జిగా పనిచేస్తున్న జడ వినీల్‌కుమార్‌ను కామారెడ్డి జిల్లా బిచ్కొండకు, ధర్మపురి జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌గా పనిచేస్తున్న పి.శ్యాం ప్రసాద్‌ను హైదరాబాద్‌ ఆరోమెట్రోపాలిన్‌కు జగిత్యాల ప్రిన్సిపాల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జిగా పనిచేస్తున్న శ్రీనిజ కోహిర్కర్‌ను జగిత్యాల మొదటి అదనపు జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌గా బదిలీ చేశారు. మేడ్చల్‌ మొదటి అదనపు జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌గా పనిచేస్తున్న ఆర్‌.లావణ్యను జగిత్యాల ప్రిన్సిపాల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జిగా, వనపర్తి రెండో అదనపు జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌గా పనిచేస్తున్న యేగి జానకిని ధర్మపురికి బదిలీ చేశారు.

అక్రమాలకు పాల్పడితే చర్యలు

పెగడపల్లి: ఉపాధిహామీ పథకంలో ప్రతీ కూలికి పని కల్పించాలని డీఆర్డీవో రఘువరన్‌ సూచించారు. శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. మస్టర్‌లో కూలీల నుంచి సేకరించిన సంతకాల్లో తేడాలు కనిపించడంతో క్షేత్రస్థాయి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశా రు. మొత్తంగా రూ.63,944 వేలు దుర్విని యోగం జరిగినట్లు గుర్తించారు. ఎఫ్‌ఏల నుంచి రూ.15,673, పంచాయతీ కార్యదర్శుల నుంచి రూ. 17,175, టీఏల నుంచి రూ.26.3 20 రికవరీకి ఆదేశాలు జారీ చేశారు. అడిషనల్‌ డీఆర్డీవో మధన్‌మోహన్‌, ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి, కృష్ణారెడ్డి, దేవేందర్‌రెడ్డి, బాలునాయక్‌, ఏపీవో అనిల్‌ పాల్గొన్నారు.

పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి

జగిత్యాల: పచ్చదనం పరిశుభ్రత అందరి బాధ్యత అని డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్‌ పేర్కొన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం మోతె పట్టణ ఆరోగ్య కేంద్రం నుంచి పాతబస్టాండ్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2030 వరకు మలేరియాను నిర్మూలించాలన్న లక్ష్యంగా పెట్టుకున్నామని, ప్రతీ ఒక్కరు కృషి చేయాలన్నారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్‌, ప్రోగ్రాం ఆఫీసర్‌ సమియోద్ధీన్‌, స్వాతి, సత్యనారాయణ, శ్రీధర్‌, రవీందర్‌ పాల్గొన్నారు.

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

ధర్మపురి: ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా లీడ్‌బ్యాంకు ఎఫ్‌ఎల్సీ కోట మధుసుదన్‌ సూచించారు. మండలంలోని జైనాలో శుక్రవారం ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా మధుసూదన్‌ మాట్లాడుతూ కేంద్రప్రభుత్వ పథకాలైన జన సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన, సుకన్య సమృద్ధి యోజన, అటల్‌ పెన్షన్‌ యోజన పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎస్‌బీఐ బ్యాంకు మేనేజర్‌ నరేశ్‌, కార్యదర్శి సురేశ్‌ పాల్గొన్నారు.

పలువురు జడ్జీల బదిలీ1
1/2

పలువురు జడ్జీల బదిలీ

పలువురు జడ్జీల బదిలీ2
2/2

పలువురు జడ్జీల బదిలీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement