ఇస్లామాబాద్: ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల ఎఫెక్ట్ పాకిస్తాన్ను తాకింది. ఇరాన్పై దాడుల నేపథ్యంలో పాకిస్తాన్లో ఆందోళనలు మొదలయ్యాయి. పాకిస్తాన్ కరాచీలోని అమెరికా కాన్సులేట్పై పాకిస్తానీలు దాడి చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి నిరసనగా ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది.
వివరాల మేరకు.. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి నేపథ్యంలో పాకిస్తాన్లో ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం ఉదయం నిరసనకారులు.. పాకిస్తాన్లోని కరాచీలో ఉన్న అమెరికా కాన్సులేట్పై కర్రలు, రాడ్లు, రాళ్లతో దాడులు చేశారు. కాన్సులేట్ భవనానికి నిప్పు పెట్టారు. దీంతో, రంగంలోకి దిగిన పాకిస్తాన్ సైన్యం, పోలీసులు.. నిరసనకారులపైకి టియర్ గ్యాస్ ప్రయోగించారు. మరోవైపు.. అమెరికా సైన్యం కాల్పుల జరపడంతో ఎనిమిది పాకిస్తానీలు మృతి చెందినట్టు, పలువురు గాయపడినట్టు సమాచారం. ఈ క్రమంలో అమెరికా కాన్సులేట్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.
🚨🔴8 people were lost his life during a protest near the US Consulate in Karachi. pic.twitter.com/ynmgd3MWuP
— THE UNKNOWN MAN (@Theunk5555) March 1, 2026
US embassy in Karachi under siege pic.twitter.com/Vu7e46gL9e
— laulukaskas (@clockstiqqun) March 1, 2026
Another video
US Consulate in Karachi, Pakistan, is now under attack by protesters.🚨 pic.twitter.com/euIGG5IVNl— Fatiqmir (@fatiqmir) March 1, 2026



