బొగ్గు గనిలో ప్రమాదం.. 30 మంది కార్మికులు మృతి | Many People Dead In Iran Coal Mine Blast | Sakshi
Sakshi News home page

బొగ్గు గనిలో ప్రమాదం.. 30 మంది కార్మికులు మృతి

Sep 22 2024 1:02 PM | Updated on Sep 22 2024 1:11 PM

Many People Dead In Iran Coal Mine Blast

టెహరాన్‌: ఇరాన్‌లో ఘోర విషాదకర ఘటన చోటుచేసుకుంది. బొగ్గు గనిలో పేలుడు కారణంగా 30 మంది మరణించగా మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. బొగ్గు గనిలో మీథేన్ గ్యాస్ లీక్ అవ్వడం వల్ల ఈ ఘోరం జరిగిందని స్థానిక మీడియా వెల్లడించింది.

వివరాల ప్రకారం.. ఇరాన్‌ రాజధాని టెహరాన్‌కు 540 కిలోమీటర్ల దూరంలో ఉన్న తబాస్‌లోని బొగ్గు గనిలో శనివారం అర్థరాత్రి ప్రమాదం జరిగింది. బొగ్గు గని నుంచి మీథేన్ గ్యాస్ లీక్ కావడంతో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బొగ్గు గనిలో 70 మంది పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రమాదం కారణంగా ఇప్పటి వరకు 30 మంది మరణించగా.. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. గని లోపల మరో 24 మంది చిక్కుకున్నట్టు స్థానిక మీడియా వెల్లడించింది. అలాగే, మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందని స్పష్టం చేసింది. 

మరోవైపు.. బొగ్గు గనిలో పేలుడు ఘటనపై ఇరాన్ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ స్పందించారు. గనిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మరణించిన వారి కుటుంబాలకు అన్ని విధాలుగా సహాయం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై విచారణ ప్రారంభించామని తెలిపారు. 

ఇది కూడా చదవండి: కమలా హారీస్‌కు పుతిన్‌ మద్దతు.. ట్విస్ట్‌ ఇచ్చిన లావ్రోవ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement