ఇజ్రాయెల్‌ మరో యుద్ధం.. ఇరాన్‌పై వైమానిక దాడులు.. | Israeli Military Conducts Preemptive Strike On Iran Targeting Nuclear Sites, Watch Videos And More Updates Inside | Sakshi
Sakshi News home page

Israel Strikes On Iran: ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు.. ఎమర్జెన్సీ విధింపు..

Jun 13 2025 7:45 AM | Updated on Jun 13 2025 11:36 AM

Israel Conducts Preemptive Strike On Iran

ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్‌ రాజధాని ట్రెహాన్‌ టార్గెట్‌గా ఇజ్రాయెల్‌ దాడులు చేస్తోంది. ఇరాన్‌కు చెందిన అణు కర్మాగారం, సైనిక స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. మరోవైపు.. ఇజ్రాయెల్‌లో అత్యవసర పరిస్థితి విధిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఇరాన్‌పై యుద్ధం విషయంలో అమెరికా మాటను వినేందుకూ ఇజ్రాయెల్‌ సిద్ధంగా లేకపోవడం గమనార్హం. మరోవైపు దీనిని తిప్పికొట్టేందుకు ఇరాన్‌ అదే స్థాయిలో ఏర్పాట్లు చేసుకుంటోంది. వందల బాలిస్టిక్‌ క్షిపణులను సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో యుద్ధం ఎటు దారితీస్తుందోనన్న భయాందోళనలు ప్రపంచమంతటా వ్యక్తమవుతున్నాయి. 

ఇజ్రాయెల్‌ దాడులపై నెతన్యాహు ప్రకటన..

  • ఇరాన్‌పై ‘ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌’ ప్రారంభించామని నెతన్యాహు ప్రకటన
  • ఇరాన్ అణ్వాయుధీకరణ కార్యక్రమం, అణు కేంద్రాలను టార్గెట్‌ చేసినట్టు చెప్పుకొచ్చారు.
  • ఇరాన్‌పై ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌ ప్రారంభమైంది.
  • ఎన్ని రోజులైన ఆపరేషన్‌ కొనసాగుతుంది. 
  • ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇరాన్‌ పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్‌ అధిపతి మృతి!

ఇరాన్‌ (Iran)పై ఇజ్రాయెల్‌ ముందస్తు వైమానిక దాడులు చేసింది. టెహ్రాన్‌లోని ఓ ప్రాంతంలో శుక్రవారం భారీగా పేలుడు శబ్ధాలు వినిపించాయి. ఈ మేరకు ఇరాన్‌లోని ఓ వార్తా సంస్థ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఇరాన్‌కు చెందిన అణు కేంద్రాలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. డజన్ల కొద్దీ దాడులు జరిగాయని సమాచారం. వీటి తర్వాత టెహ్రాన్ అంతర్జాతీయ విమానాశ్రయం అన్ని విమానాలను నిలిపివేసింది.

మరోవైపు.. ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇరాన్‌కు భారీ నష్టం​ జరిగినట్టు తెలుస్తోంది. ఇరాన్‌ ఆర్మీ చీఫ్‌ సహా సైనికులను టార్గెట్‌ చేసి ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు చేసినట్టు సమాచారం. 

ఇజ్రాయెల్‌లో ఎమర్జెన్సీ.. 
మరోవైపు ఇజ్రాయెల్‌లో ప్రత్యేక అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఆ దేశ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ దేశంలో దాడులు జరగవచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఇరాన్ లో తాము దాడులు నిర్వహించామని.. దీని కారణంగా ఇజ్రాయెల్లో కూడా క్షిపణి లేదా డ్రోన్ దాడులు జరగవచ్చని ఆయన అన్నారు. ఇక ఇరాన్‌పై దాడులు చేయడంలో ఇజ్రాయెల్ ఏకపక్షంగా వ్యవహరించిందని, ఈ ఆపరేషన్‌లో అమెరికా ప్రమేయం లేదని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో స్పష్టం చేసారు. ఈ ప్రాంతంలోని అమెరికన్ దళాలను రక్షించడం తమ పరిపాలన యొక్క అగ్ర ప్రాధాన్యత అని ఆయన అన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే తాము చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇరాన్ అమెరికా ప్రయోజనాలను లేదా సిబ్బందిని లక్ష్యంగా చేసుకోకూడదని మార్క్ అన్నారు. 

 

అమెరికా స్పందన..
ఇరాన్‌పై ఇజ్రాయెల్ చేస్తున్న వైమానిక దాడులతో తమ దేశానికి ఎలాంటి సంబంధం లేదని అమెరికా విదేశాంగశాఖ మంత్రి  మార్కో రూబియో ప్రకటించారు. టెహ్రాన్‌ దాడికి రావొద్దని, తమ దేశానికి చెందిన వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవద్దని సూచించారు. అమెరికా బలగాలను కాపాడుకోవడమే తమ తొలి ప్రాధాన్యత అని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement