
బీఆర్ఎస్తోనే మారిన బంజారాల బతుకులు
బంజారాహిల్స్: బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కృషితో తెలంగాణలో బంజారాల బతుకులు మారాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. అఖిల భారత బంజారాల ఆధ్యాత్మిక గురువు, పౌరాదేవీ పీఠాధిపతి శ్రీశ్రీ చంద్రశేఖర్ మహారాజ్ బుధవారం ఎమ్మెల్సీ కవిత నివాసానికి విచ్చేశారు. ఈ సందర్భంగా సంప్రదాయబద్దంగా ఎమ్మెల్సీ కవిత వారిని ఆహ్వానించి సన్మానించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం ఎమ్మెల్సీకవిత మాట్లాడుతూ... రాష్ట్రంలోని బంజారాల ఆశీస్సులు కేసీఆర్పై, బీఆర్ఎస్ పార్టీపై ఉన్నాయని తెలిపారు. బంజారా పిల్లలకు విద్య, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చడానికి కేసీఆర్ ఎన్నో చర్యలు తీసుకున్నారని వివరించారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం సహకరించుకున్నా ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించి కేసీఆర్ చరిత్ర సృష్టించారని స్పష్టం చేశారు. దేశంలోనే తొలిసారిగా సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యే చంద్రవతి, హరిప్రియ నాయక్ తదితరులు పాల్గొన్నారు.