ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద కారు బీభత్సం | - | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద కారు బీభత్సం

Mar 4 2025 6:39 AM | Updated on Mar 4 2025 6:37 AM

లక్డీకాపూల్‌ : నెక్లెస్‌ రోడ్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు డివైడర్‌ను ఢీ కొని ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది. ఆ సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో పెను ముప్పు తప్పింది. సోమవారం ఖైరతాబాద్‌ జంక్షన్‌ నుంచి సెక్రటేరియేట్‌ వైపు వెళుతున్న ఓ కారు అతివేగం కారణంగా ఎన్టీఆర్‌ ఘాట్‌ మలుపు వద్ద అదుపు తప్పింది. కారు డివైడర్‌పైకి దూసుకెళ్లి కరెంట్‌ పోల్‌ను ఢీకొనడంతో పోల్‌ రోడ్డపై అడ్డంగా విరిగిపడింది. ఈ సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో విద్యుత్‌ స్తంభంతో పాటు రెండు చెట్లు ధ్వంస మయ్యాయి. కాగా కారు నడిపిన వ్యక్తి కూడా సురక్షితంగా బయటపడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న సైఫాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కారు నడిపిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడా అనే కోణంలో విచారణ చేపట్టారు. ప్రమాదం అనంతరం కారు డ్రైవర్‌ వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయినట్లు సమాచారం.

రోడ్డు డివైడర్‌ను ఢీకొనిఫుట్‌పాత్‌ పైకి ఎక్కిన కారు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement