రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో భానోజికి తృతీయ స్థానం | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో భానోజికి తృతీయ స్థానం

Aug 25 2025 8:01 AM | Updated on Aug 25 2025 8:01 AM

రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో భానోజికి తృతీయ స్థానం

రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో భానోజికి తృతీయ స్థానం

రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో భానోజికి తృతీయ స్థానం

సత్తెనపల్లి: రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన మాజీ కౌన్సిలర్‌ పులహరి భానోజి ప్రతిభ చూపారు. సత్తెనపల్లి శక్తి యోగ నిర్వాహకుడు రమేష్‌ ఆధ్వర్యంలో 6వ ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ లెవెల్‌ యోగ ఆసనం స్పోర్ట్స్‌ చాంపియన్‌షిప్‌– 2025 పోటీలు తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులో ఈనెల 21 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించారు. పోటీలకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ పోటీల్లో సీనియర్‌ విభాగం 45–55 సంవ్సరాల విభాగంలో స్టేట్‌ లెవెల్‌ లో లెగ్‌ బ్యాలెన్స్‌ లో సత్తెనపల్లికి చెందిన పులహరి భానోజీ ప్రతిభ కనబరిచి తృతీయ స్థానం దక్కించుకొని బహుమతి, మెడల్‌తో పాటు మెరిట్‌ సర్టిఫికెట్‌ అందుకున్నారు. ఫార్వర్డ్‌బెండ్‌ విభాగంలో సత్తెనపల్లికి చెందిన వల్లూరి శ్రీనివాసరావు, సుపైని విభాగంలో సత్తెనపల్లికి చెందిన పులికొండ శ్రీనివాసరావు చతుర్థ స్థానం దక్కించుకున్నారు. టెస్టింగ్‌ విభాగంలో ధనేకుల సాంబశివరావు ఐదో స్థానం కై వసం చేసుకున్నారు. 35–45 సంవత్సరాల విభాగంలో ఫార్వర్డ్‌బెండులో ఎం.సునీల్‌ కుమార్‌ నాలుగో బహుమతి సాధించారు. ఈ సందర్భంగా విజేతలను పలువురు ప్రముఖులు, యోగ అభ్యాసకులు ఆదివారం ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement