
స్టైల్గా వచ్చాడు... చక్కగా కాజేశాడు!
మంగళగిరి టౌన్: ఓ వివాహానికి స్టైల్గా హాజరై... బంధువుగా మమేకమయ్యాడు. అందరితో చనువుగా ఉంటూ, భోజనం చేసి సుమారు 4 గంటలకు పైగా వారితో తిరిగాడు. చక్కగా చదివింపులు దోచుకుపోయాడు ఓ దొంగ. ఈ ఘటన మంగళగిరి పట్టణంలో ఆలస్యంగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. సేకరించిన వివరాల ప్రకారం.. మంగళగిరి పట్టణం శివాలయం రోడ్డులో నివాసముంటున్న జి. చిన్ని తన కుమారుడు జి. సాంబశివరావు వివాహ వేడుకను ఆదివారం పట్టణ పరిధిలోని మార్కండేయ కల్యాణ మండపంలో నిర్వహించారు. ఓ గుర్తుతెలియని వ్యక్తి స్టైల్గా హాజరై అందరితోపాటు కూర్చున్నాడు. కొంతసేపు అక్కడివారితో మాట్లాడి చదివింపులు దగ్గరకు వెళ్లాడు. పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నట్లు నటిస్తూ అటూ ఇటు తిరుగతూ హడావిడి చేశాడు. పెళ్లి వారితో కలిసి విందు భోజనం కూడా ఆరగించాడు. చదివింపుల దగ్గర ఓ పాప ఉండడం గమనించి ఈ డబ్బులు లోపల పెట్టు అంటూ గదమాయించాడు. దీంతో ఆ పాప పక్కన ఉన్న రూమ్లోకి వెళ్లి అక్కడ పెట్టి వచ్చేసింది. వెంటనే ఆ వ్యక్తి ఆ రూమ్లోకి వెళ్లి తలుపు దగ్గరకు వేసి ఆ డబ్బు తీసుకుని బయటకు వచ్చాడు. పాపను చదివింపుల డబ్బు ఎక్కడ అని అడగ్గా, ఓ అంకుల్ లోపల పెట్టమన్నాడని చెప్పడంతో లోపలికి వెళ్లి చూశారు. అక్కడ డబ్బు లేకపోవడంతో కంగుతిన్నారు. పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చదివింపుల నగదుతోపాటు బంధువులు, మిత్రులు కొంతమంది బంగారపు చైన్లు, ఉంగరాలు బహుమతులుగా ఇచ్చారని ఆ ఫిర్యా దులో పేర్కొన్నారు. నగదు సుమారు రూ.3 లక్షలకుపైగా ఉంటుందని కుటుంబ సభ్యులు అంటున్నారు. మంగళగిరి పట్టణ పోలీసులు కల్యాణ మండపంలో సీసీ కెమెరా ఫుటేజ్లను పరిశీలించి ఆ వ్యక్తి కదలికలకు గుర్తించారు.
వినూత్నంగా దొంగతనం
పెళ్లిలో చదివింపులు మాయం
నిందితుడు