
హోమ్ స్టైల్ ఫుడ్, వీగన్ ఫుడ్
విద్యార్థుల్లో కనపడిన ఆరోగ్య స్పృహ
అయినా బిర్యానీ, బర్గర్స్దే హవా..
సాక్షి, సిటీబ్యూరో: వేసవి సెలవులను పురస్కరించుకుని విద్యార్థులకు రైలులోకి ఆహారం అందించే వినూత్న తరహా ఫుడ్ ఆన్ ట్రైన్ని అందుబాటులోకి తెచ్చిన ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్.. స్విగ్గీ వేసవి సెలవులు ముగిసిన నేపథ్యంలో ఈ ఆఫర్ను విద్యార్థులు ఉపయోగించుకున్న తీరుపై, తమ అధ్యయన ఫలితాలను విడుదల చేసింది.
స్విగ్గీ లిమిటెడ్ వెల్లడించిన ప్రకారం.. వెరైటీ వంటకాలకు ఓటు
విద్యార్థులు ఆర్డర్ చేసిన ఆహార పదార్థాల్లో బిర్యానీ, బర్గర్స్, పనీర్ టిక్కా క్యూసాడిల్లా, స్పాగెట్టి, అగ్లియో ఒలియో వంటి ఇటాలియన్, అరబిక్, మెడిటేరియన్ ఫుడ్, కింగ్ ఫిష్ తవా ఫ్రై, చికెన్ కాషాభునా వంటి సీఫుడ్ టాప్ ప్లేస్లో ఉన్నాయి. ఆరోగ్య స్పృహ కలిగిన పలువురు విద్యార్థులు, ఆరోగ్యకరమైన పాత్రలు, హోమ్స్టైల్ భోజనాల కోసం ది గుడ్ బౌల్ లంచ్బాక్స్లతో పాటు వీగన్ స్టైల్ వంటకాలను కోరుకున్నారు. బ్రాండెడ్ ఫుడ్ కోసం మెక్డొనాల్డ్స్, కేఎఫ్సీ, సబ్వే, పిజ్జాహట్ నుంచి ఎంచుకున్నారు.
ఇంజినీరింగ్ విద్యార్థులే ఎక్కువ..
ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా వంటి నగరాలకు రాకపోకలు సాగించే విద్యార్థులు అత్యధికంగా నాగ్పూర్ స్టేషన్లో ఫుడ్ డెలివరీ చేయించుకున్నారు. రైళ్లలో ఆహారం కోసం దాదాపు 70శాతం ఆర్డర్లతో ఇంజినీరింగ్ విద్యార్థులు ఈ ఫుడ్ ఆన్ ట్రైన్ వినియోగించుకుని జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. ఐఐటీ ఖరగ్పూర్, ఐఐటీ బీహెచ్యూ వారణాసి వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలకు చెందిన విద్యార్థులు ముందున్నారు. రైళ్లలో ఆర్డర్ చేసేటప్పుడు విద్యార్థులు సమయపాలన పాటించలేదు. ఉదయం 7 గంటలకు అల్పాహారం నుంచి రాత్రి 11 గంటలకు లేట్నైట్ స్నాక్స్, డెజర్ట్ దాకా విద్యార్థులు రొటీన్కు భిన్నంగా ఆర్డర్లు చేశారు.