
భారతదేశంలో మహిళా రైతులకు ప్రోత్సాహకాలు అందించడానికి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాలు, కార్యక్రమాలను అమలుచేస్తున్నాయి. అవేంటంటే..
సమాన భూమి హక్కులు.. మహిళా రైతులకూ సమానంగా భూమి హక్కులు కల్పించడం వల్ల వారి ఆర్థిక, సామాజిక సాధికారతను పెంపొందిస్తున్నారు.
రుణాలు, ఇతర ఆర్థిక సహాయం.. మహిళారైతులకు రుణసౌకర్యాలు, సబ్సిడీలు, ఇతర ఆర్థిక సహాయాలు అందించడం ద్వారా వ్యవసాయ కార్యక్రమాలనుప్రోత్సహిస్తున్నారు.
మిషన్ హార్టీ కల్చర్.. ఈ పథకంతో మహిళలకు సాగు నైపుణ్యం, శిక్షణ, సబ్సిడీలు, మద్దతులను అందిస్తున్నారు.
సహాయక సమూహాలు (సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్), రైతు ఉత్పత్తిదారుల సంస్థలు మహిళా రైతులకు సాధికారత కల్పించే లక్ష్యంతో మహిళల నేతృత్వంలోని ఎఫ్పీఓలను ఏర్పాటు చేస్తున్నారు.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి
(పీఎమ్ – కిసాన్)..
ఈ పథకం ద్వారా అర్హతగల రైతులకు బయోడిజాస్టర్లను అందిస్తూ రైతుల శ్రమ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు దీనివల్ల ఆదాయమూ పెరుగుతోంది.
సాంకేతిక పరికరాలు, శిక్షణ.. మహిళా రైతుల కోసం ప్రత్యేక పరికరాలు అందించి.. శిక్షణ కార్యక్రమాలనూ నిర్వహిస్తూ వారు మరింత సమర్థవంతంగా పనిచేయడానికి భారతప్రభుత్వం కృషిచేస్తోంది.
పట్టణప్రాంతాలకు పురుషుల వలస పెరుగుతున్నందున పశువుల పెంపకం, పాడిపరిశ్రమ, ఉద్యానవనాల పెంపకం, సాగు/సామాజిక అటవీ, చేపలు పట్టడం వంటి పనులను ఎక్కువగా మహిళలే నిర్వహిస్తున్నారు. దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం ఆహారంలో దాదాపు 60– 80 శాతాన్ని గ్రామీణ మహిళలే అందిస్తున్నారు. అయినప్పటికీ వారి శ్రమకు తగిన గుర్తింపు లభించట్లేదు. సమప్రాధాన్యం అందట్లేదు.
అందుకే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయరంగంలో గ్రామీణ మహిళల సాధికారత కోసం అనేక పథకాలు, కార్యక్రమాలను చేపట్టింది. అందులో ఒకటే కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ అమలు చేస్తున్న ‘నమో డ్రోన్ దీదీ’ పథకం. ఇది ఈఅ్గNఖఔM కింద మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్లను అందిస్తుంది. ఈ పథకం మొత్తం బడ్జెట్ రూ. 1261 కోట్లు. ద్రావకాలు, పురుగుల మందుల వాడకానికి.. 2024–25 నుంచి 2025–2026 వరకు ఎంపిక చేసిన 14, 500 మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు డ్రోన్లను అందించడం దీని ప్రస్తుత లక్ష్యం.
అత్యంత ప్రజాదరణ పొందిన కేంద్రప్రభుత్వ పథకాల్లో ‘బేటీ బచావో.. బేటీ పఢావో’, ‘సుకన్య సమృద్ధి యోజన’ కూడా ఉన్నాయి.
– బి.ఎన్. రత్న
బిజినెస్ కన్సల్టెంట్, దలీప్
మీ సందేహాలను పంపవలసిన
మెయిల్ ఐడీ ownership.sakshi@gmail.com
నిర్వహణ : సరస్వతి రమ