భాగ్యనగరంలో ప్రవాసీ ఒడియా ఫెస్టివల్‌..! | Patha Utsav 2025 Celebrating Odisha in HyderabadUtkal Youth Association | Sakshi
Sakshi News home page

భాగ్యనగరంలో ప్రవాసీ ఒడియా ఫెస్టివల్‌..!

Apr 14 2025 9:35 AM | Updated on Apr 14 2025 9:35 AM

Patha Utsav 2025 Celebrating Odisha in HyderabadUtkal Youth Association

ఒడిశా వాసులు గచ్చిబౌలి డివిజన్‌లోని ఖాజాగూడ పెద్ద చెరువు వద్ద సందడి చేశారు. ఉత్కళ ఒడియా యూత్‌ అసోసియేషన్‌ హైదరాబాద్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ ప్రవాసీ ఒడియా ఫెస్టివల్‌ ‘పత్‌ ఉత్సవం’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలో నివాసముండే ఒడిశా వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఉత్సాహాన్ని ప్రకటించారు. 

మొదట ఇస్కాన్‌ బృందం వారిచే కృష్ణ పరమాత్మ, రామలీలలపై గానామృతం నిర్వహించగా అందరినీ ఆకట్టుకుంది. అనంతరం రోడ్‌ రంగోలి మురుజా, ఆతోంటిక్, ఒడియా క్యూసిన్, డిస్‌ప్లే, ఆర్ట్, పైకా ఆర్ట్, టైగర్‌ నృత్యాలు వంటివి నిర్వహించి తమ సంప్రదాయాన్ని చాటుకున్నారు. 

అనంతరం శంఖనాథాలతో కూడిన నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఓద్రా, దేహం జుంబా నృత్యాలతోపాటు పిల్లల గ్లోబల్‌ ఆర్ట్స్‌ డ్రాయింగ్‌ పోటీలను నిర్వహించగా ఒడిశా వాసులు ఆసక్తిగా తిలకించారు. 

ప్రత్యేక ఆహ్వానితులుగా ఐపీఎస్‌ అధికారి సౌమ్యామిశ్రా, సుప్రసిద్ధ గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ అనురాధ పాండ్వా పాల్గొని అందరినీ మరింత ఉత్సాహపరిచారు. అనంతరం అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అతిథులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నగరంలోని ఒడిశా వాసులు పాల్గొన్నారు.  

(చదవండి: సరికొత్త మ్యూజిక్‌ థెరపీ..'జెంబే'..! ఆ వ్యాధులను నయం చేస్తుందట..!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement