Murudeshwar కోరిన కోర్కెలు తీర్చే పరమ పావన క్షేత్రం | Karnataka Lord Shiva Murudeshwar Temple Interesting And Lesser Known Facts In Telugu | Sakshi
Sakshi News home page

Murudeshwar Temple Facts: కోరిన కోర్కెలు తీర్చే పరమ పావన క్షేత్రం

Jun 12 2025 9:45 AM | Updated on Jun 12 2025 1:13 PM

Murudeshwar temple in Karnataka interesting facts about Lord Shiva

 మురుడేశ్వర్‌ కోరికలు తీర్చే- పావన క్షేత్రం

పాండవులు పూజించిన పుణ్యక్షేత్రమిది. సాక్షాత్తూ పార్వతీ పరమేశ్వరుల పాదధూళి పడిన పావన తీర్థమిది. సురపతి అయిన ఇంద్రుడు సందర్శించిన ఆలయమిది. అదే మురుడేశ్వర్‌ (Murudeshwar temple). ఇక్కడ కొలువైన స్వామికి మురుడేశ్వరుడని పేరు. ఈ స్వామిని పూజించడం వల్ల తమ కోరికలన్నీ నెరవేరతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఇక్కడికి దేశంలోని అన్ని ప్రాంతాలనుంచి భక్తులు వచ్చి పూజిస్తుంటారు. అతి ప్రాచీనక్షేత్రమైన ఈ పుణ్యస్థలి ఉన్నది కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా బత్కల్‌ తాలూకాలో. 

రావణాసురుడు తన అనన్యసామాన్యమైన భక్తితో శివుని మెప్పించి, కైలాసం నుంచి ఆయన ఆత్మలింగాన్ని తీసుకుని వస్తుంటాడు. రావణాసురుడి చేతికి శివుడి ఆత్మలింగం చిక్కితే, అతను దాన్ని లంకలో ప్రతిష్ఠిస్తే ఇక రావణుని అకృత్యాలకు అడ్డుకట్ట వేయగలవారే ఉండరనే ఉద్దేశ్యంతో దేవతల కోరికమేరకు వినాయకుడు ఒక పిల్లవాడి రూపంలో వస్తాడు. సాయంత్రం వేళ సంధ్యావందనం చేయడం కోసం ఆత్మలింగాన్ని ఎవరికి అప్పగించాలా అని ఆలోచిస్తూ ఉంటాడు రావణుడు, ఆత్మలింగాన్ని తన చేతిలో పెట్టేముందు దానిని మార్గమధ్యంలో భూమిమీద ఎక్కడా ఉంచకూడదని శివుడు చెప్పిన విషయాన్ని గుర్తు తెచ్చుకున్న రావణుడి కంట పడతాడు బ్రాహ్మణ బాలుడి వేషంలో ఉన్న గణపతి. కాసేపు శివలింగాన్ని చేతితో పట్టుకుని ఉంటే, తాను స్నానసంధ్యలు ముగించుకుని వస్తానని చెప్పి వెళతాడు రావణుడు. పథకం ప్రకారం, రావణుడు వచ్చేలోగా శివలింగాన్ని నేలమీద పెట్టేస్తాడా బాలుడు. ఇంకేముంది, శివలింగం భూమిలో దిగబడిపోతుంది. రావణుడు ఎంత ప్రయత్నించినా బయటకు రాదు. అప్పుడు రావణుడు ఆగ్రహంతో ఆత్మలింగానికి కప్పి ఉన్న వస్త్రం, దారం తదితర వస్తువులను విసిరి పాండవులు పూజించిన పుణ్యక్షేత్రమిది. సాక్షాత్తూ పార్వతీ పరమేశ్వరులపాదధూళి పడి పావన తీర్థమిది. సురపతి అయిన ఇంద్రుడు సందర్శించిన ఆలయమిది. అదే మురుడేశ్వర్‌. 

చదవండి: అమెరికాలో వాల్‌మార్ట్‌లో అమ్మానాన్నలతో : ఎన్‌ఆర్‌ఐ యువతి వీడియో వైరల్‌

ఇక్కడ కొలువైన స్వామికి మురుడేశ్వరుడని పేరు. ఈ స్వామిని పూజించడం వల్ల తమ కోరికలన్నీ నెరవేరతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఇక్కడికి దేశంలోని అన్ని ప్రాంతాలనుంచి భక్తులు వచ్చి పూజిస్తుంటారు. అతి ప్రాచీనక్షేత్రమైన ఈ పుణ్యస్థలి ఉన్నది కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా బత్కల్‌ తాలూకాలో పారేస్తాడు. ఆ వస్తువులు ఎక్కడెక్కడ పడ్డాయో, అక్కడ శివలింగాలు ఉద్భవించి, ఆ ప్రదేశాలు మహిమాన్విత ప్రదేశాలుగా మారిపోయాయి. అవే, గోకర్ణక్షేత్రానికి దగ్గరలో ఉన్న సజ్జేశ్వర, గుణవంతేశ్వర, మురుడేశ్వర, ధారేశ్వర లింగాలు. ఈ క్షేత్రాలన్నీ కలిపి పంచక్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. ఆత్మలింగం మీద ఉన్న వస్త్రాన్ని రావణాసురుడు విసిరేస్తే, ఆ వస్త్రం పడిన ప్రదేశమే మురుడేశ్వరమయింది. మురుడ అంటే కన్నడంలో వస్త్రం అని అర్థం. సంతోషం అనే అర్థం కూడా ఉంది. అందరికీ సంతోషాన్ని ఇచ్చే ప్రదేశం కాబట్టి ఇది మురుడేశ్వరక్షేత్రమయిందని అంటారు. మురుడేశ్వరంలో ఉద్భవించిన శివలింగానికి పానవట్టాన్ని దేవశిల్పి విశ్వకర్మను రప్పించి, శివుడే స్వయంగా దగ్గరుండి తయారు చేయించాడని ప్రతీతి. 

ఈ క్షేత్రానికి ఉత్తరాన భవానీమాత, తూర్పున దుర్గామాత, ఇతర దేవతలందరూ మిగిలిన దిక్కులలో ఉండి పరిరక్షిస్తూ ఉంటారని, బ్రహ్మదేవుడు కూడా ఇక్కడికి వచ్చి మురుడేశ్వరుడిని పూలు, పత్రాలతో పూజించి, పండ్లను నివేదించి వెళుతుంటాడని, బ్రహ్మదేవుడు శివుడిపై తన కమండలంతో చిలకరించిన నీటితో కమండల తీర్థం అనే పవిత్ర సరస్సు ఏర్పడిందనీ స్థలపురాణం చెబుతోంది. .

అనితర సాధ్యమైన శిల్పసౌందర్యం... 
మురుడేశ్వర దేవాలయం ఆ కాలంలో దేవాలయ నిర్మాణంలో పవిత్రతకు, అద్భుత శిల్పసౌందర్యానికి నిదర్శనం. మురుడేశ్వర దేవాలయం ఆవర ణంలో కనిపించే శివుని ఎత్తైన పాలరాతి విగ్రహం అందరినీ ఆశ్చర్య చకితులను చేస్తుంది. 123 అడుగుల ఎత్తున్న ఈ విగ్రహాన్ని నిర్మించడానికి రెండేళ్ల పట్టిందట. 20 అంతస్థులతో కూడిన ఆలయ గాలిగోపురం సుమారు 250 అడుగుల ఎత్తులో ఉంటుంది. గాలిగోపురానికి ఇరుపక్కలా గల ఏనుగు ప్రతిమలు సజీవ శిల్పాల్లా కనిపిస్తాయి.

తీర్థేశ్వరం కూడా... 
మురుడేశ్వరంలో పవిత్ర స్నానాలు చేయడానికి బ్రహ్మతీర్థం, కమండల తీర్థం, అగ్నితీర్థం, భీమతీర్థం, దేవతీర్థం అనే ముఖ్యమైన తీర్థాలున్నాయి. ఈ తీర్థాలలో స్నానం చేయడం వల్ల దీర్ఘవ్యాధులు నశిస్తాయని, కోరిన కోరికలు నెరవేరతాయనీ అంటారు. ఆలయ ప్రాంగణంలోనే ఇతర దేవతల సన్నిధులు కూడా ఉన్నాయి. వాటిలో గణపతి మందిరం, గౌరీమందిరం, దత్తాత్రేయ, సుబ్రహ్మణ్య, ఆంజనేయ మందిరాలు ముఖ్యమైనవి. ఆలయం ఆవరణలో ఉన్న రావిచెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి, తమ కోరికలను నెరవేర్చమని భక్తులు ముడుపులు కడుతుంటారు. 

ఎలా వెళ్లాలంటే..? 
గోకర్ణం నుంచి మురుడేశ్వరం సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. మురుడేశ్వరం 17వ నంబరు జాతీయ రహదారిలో ఉండటం వల్ల రవాణా సౌకర్యాలు బాగానే ఉన్నాయి. బెంగళూరు, మంగుళూరు, హుబ్లీ, ధర్మస్థల నగరాలనుంచి బస్సులున్నాయి. నేరుగా రైలు సౌకర్యం కూడా ఉంది.  

భోజన, వసతి: ఇక్కడ యాత్రీకులు ఉండటానికి వసతి గృహాలు, హోటళ్లు ఉన్నాయి. 

– డి.వి.ఆర్‌. భాస్కర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement