హైదరాబాద్‌లో ఇండియ‌న్ వెయిన్ కాంగ్రెస్‌ | The Indian Vein Congress 2024 Held at Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ఇండియ‌న్ వెయిన్ కాంగ్రెస్‌

Nov 8 2024 5:31 PM | Updated on Nov 8 2024 5:32 PM

The Indian Vein Congress 2024 Held at Hyderabad

నగరంలో ఇండియ‌న్ వెయిన్ కాంగ్రెస్‌

ప్ర‌పంచ‌వ్యాప్తంగా అందుబాటులోకి అత్యాధునిక చికిత్సా విధానాలు

జాతీయ‌, అంత‌ర్జాతీయ వైద్య నిపుణుల వెల్ల‌డి

సాక్షి,హైదరాబాద్‌ : మ‌న దేశంలో దాదాపు 25 శాతం మంది ప్ర‌జ‌లు వెరికోస్ వెయిన్స్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నార‌ని, వీళ్లలో చాలామందికి శ‌స్త్రచికిత్స‌లు అవ‌స‌రం లేకుండానే న‌యం చేయొచ్చ‌ని జాతీయ‌, అంత‌ర్జాతీయ వైద్య నిపుణులు తెలిపారు. ప్ర‌స్తుతం అనేక అత్యాధునిక చికిత్సా విధానాలు అందుబాటులోకి వ‌చ్చాయ‌ని, వాటిని అందిపుచ్చుకుని దేశంలో ఏ మారుమూల ప్రాంతంలోనైనా అద్భుత‌మైన చికిత్స‌లు చేయొచ్చ‌ని వివ‌రించారు. 

న‌గ‌రంలోని అవిస్ ఆస్ప‌త్రి ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్‌లోని మాదాపూర్‌లో గ‌ల డిస్ట్రిక్ట్ 150 కాన్ఫ‌రెన్స్ హాల్లో జాతీయ స్థాయిలో ఇండియ‌న్ వెయిన్ కాంగ్రెస్ 2024ను శుక్ర‌వారం నిర్వ‌హించారు. దీనికి అవిస్ ఆస్ప‌త్రి వ్య‌వ‌స్థాప‌కుడు, ప్ర‌ముఖ వాస్క్యుల‌ర్ ఇంట‌ర్వెన్ష‌న‌ల్ నిపుణుడు డాక్ట‌ర్ రాజా వి. కొప్పాల నేతృత్వం వ‌హించారు. దేశంలోని ప‌లు రాష్ట్రాల నుంచి 100 మంది వ‌ర‌కు వైద్య నిపుణులు దీనికి ప్ర‌త్యక్షంగా హాజ‌ర‌య్యారు. బ్రెజిల్ నుంచి కొంద‌రు నిపుణులు ఆన్‌లైన్‌లో హాజ‌రై త‌మ అభిప్రాయాలు, అనుభ‌వాల‌ను పంచుకున్నారు.

ముఖ్యంగా వెరికోస్ వెయిన్స్ స‌మ‌స్య‌ను శ‌స్త్రచికిత్స‌లు అవ‌స‌రం లేకుండా లేజ‌ర్ల ద్వారా, ఇత‌ర మార్గాల్లో నయం చేయ‌డం ఎలాగ‌న్న అంశంపై ఇందులో విస్తృతంగా చ‌ర్చించారు. అవిస్ ఆస్ప‌త్రిలో గ‌త ఎనిమిదేళ్లుగా ఇప్ప‌టికి దాదాపు 40 వేల మందికి పైగా రోగుల‌కు శ‌స్త్రచికిత్స అవ‌స‌రం లేకుండా న‌యం చేశామ‌ని, ఈ రంగంలో వ‌స్తున్న మార్పుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకోవ‌డం చాలా ముఖ్య‌మ‌ని డాక్ట‌ర్ రాజా వి. కొప్పాల అన్నారు.

అంత‌ర్జాతీయంగా పేరున్న‌ డాక్ట‌ర్ రోడ్రిగో గోమ్స్ డీ ఒలీవియెరా, డాక్ట‌ర్ రాజేష్ వాసు, డాక్ట‌ర్ ఫెర్ర‌నాండో ట్రెస్ సిల్వెరియా లాంటి వాస్క్యుల‌ర్, ఇంట‌ర్వెన్ష‌న‌ల్ రేడియాల‌జీ నిపుణులు ఈ స‌ద‌స్సుకు హాజ‌రై.. అంత‌ర్జాతీయంగా ఈ రంగంలో వ‌స్తున్న ప‌లు మార్పులు, చికిత్సా విధానాలు, ఎదుర‌వుతున్న స‌వాళ్ల గురించి చ‌ర్చించారు. వీరితో పాటు వాస్క్యుల‌ర్ స‌ర్జ‌రీ, ప్లాస్టిక్ స‌ర్జ‌రీ నిపుణులు కూడా పాల్గొన్నారు. కొన్ని సంద‌ర్భాల్లో శ‌స్త్రచికిత్స‌లు అవ‌స‌రం లేద‌ని, అయితే కొన్నిసార్లు త‌ప్ప‌నిస‌రిగా శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంద‌ని తెలిపారు.

వెరికోస్ వెయిన్స్ విష‌యంలో అద్భుత‌మైన ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయ‌ని, వాటి వివ‌రాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకోవ‌డం ద్వారా విజ్ఞాన స‌ముపార్జ‌న చేయాల‌ని నిపుణులు సూచించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంపై డాక్ట‌ర్ రాజా వి. కొప్పాల సంతోషం ప్రకటించారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement