నూజివీడులో 120 ఎకరాల విస్తీర్ణంలో 2 వేల అడ్మిషన్లతో ట్రిపుల్ఐటీ నెలకొల్పారు. రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలో రాష్ట్రంలో మూడు ట్రిపుల్ఐటీలను దివంగత వైఎస్సార్ ఏర్పాటు చేస్తే దానిలో ఒకటి నూజివీడులో ఏర్పాటైంది. పూర్తిస్థాయి కార్పొరేట్ సౌకర్యాలతో ప్రారంభమైన ట్రిపుల్ఐటీ అంచెలంచెలుగా ఎదిగి వేలాది మంది పేద విద్యార్థులకు వరదాయినిగా మారింది. ఇప్పటి వరకు సుమారు 6 వేల మందికిపైగా ట్రిపుల్ఐటీ విద్యార్థులు క్యాంపెస్ ప్లేస్మెంట్లల్లో ఉన్నత కొలువులు పొందారు. అదే విధంగా గ్రూప్–2 నుండి సివిల్స్ వరకు పదుల సంఖ్యలో ట్రిపుల్ఐటీ విద్యార్థులుండడం విశేషం.
నూజివీడు ట్రిపుల్ఐటీ


