ఏలూరు (టూటౌన్): పహల్గాం ఉగ్రదాడిని వ్యతిరేకిస్తూ సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం శాంతి ర్యాలీ నిర్వహించారు. కోట దిబ్బ సీతారాం భర్తీయా కళ్యాణ మండపం నుంచి మార్కెట్ మీదుగా ఈ ర్యాలీ సాగింది. ఈ ర్యాలీని ఉద్దేశించి సీఐటీయూ ఏలూరు జిల్లా అధ్యక్షుడు ఆర్.లింగరాజు, ప్రధాన కార్యదర్శి డీఎన్వీడీ ప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిఘా వైఫల్యం వల్లే ఈ దారుణం జరిగిందన్నారు.
గత పదేళ్లుగా సైన్యంలో సైతం రిక్రూట్మెంట్ లేకుండా చేసి దేశ భద్రతనే ఫణంగా పెట్టారని విమర్శించారు. దేశ ఐక్యతను కాపాడుకోకుండా మతం పేరుతో చిచ్చుపెడుతూ ఉగ్రవాదాన్ని నిర్మూలించాలంటే అది మోసపూరితమైన చర్యేనని అన్నారు. ఇప్పటికై నా దేశ సమైక్యతను కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు వీవీఎన్ ప్రసాద్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కే శ్రీనివాస్, నాయకులు కే రామాంజనేయులు, ఎం.ఇస్సాకు, కే.పోచమ్మ, కమల తదితరులు పాల్గొన్నారు.

ఉగ్రదాడులను వ్యతిరేకిస్తూ శాంతి ర్యాలీ