విష పురుగు కుట్టి వ్యక్తి మృతి

దూబ సుమన్‌ (ఫైల్‌) - Sakshi

ముదినేపల్లి రూరల్‌: విష పురుగు కాటుకు గురై ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. ముదినేపల్లి అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన దూబ సుమన్‌ (42) పది రోజుల క్రితం ఇంటి ఆవరణలో ఉన్న చిక్కుడుపాదుకు కాసిన కాయలు కోస్తుండగా, విషపురుగు కాటు వేసింది. వెంటనే అనారోగ్యానికి గురికావడంతో స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన చికిత్స కోసం కుటుంబసభ్యులు విజయవాడ తరలించారు. చికిత్స పొందుతున్నప్పటికీ ఫలితం లేకపోవడంతో విజయవాడ వైద్యులు సోమవారం ఇంటికి పంపివేయగా మంగళవారం ఉదయం మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు శావా నాగజగన్‌బాబూరావు, మాదిగ దండోరా జిల్లా అధ్యక్షుడు ఏసుపోగు దానియేలు, అంబేడ్కర్‌ యూత్‌ కమిటీ సభ్యులు సుమన్‌ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.

Read latest Eluru News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top