వీరేశ్వరస్వామికి రూ.9.96 లక్షల ఆదాయం | - | Sakshi
Sakshi News home page

వీరేశ్వరస్వామికి రూ.9.96 లక్షల ఆదాయం

Dec 4 2025 7:26 AM | Updated on Dec 4 2025 7:26 AM

వీరేశ్వరస్వామికి  రూ.9.96 లక్షల ఆదాయం

వీరేశ్వరస్వామికి రూ.9.96 లక్షల ఆదాయం

ఐ.పోలవరం: మురమళ్ల వీరేశ్వరస్వామి దేవస్థానానికి హుండీల ద్వారా రూ.9.96 లక్షల ఆదాయం సమకూరినట్టు ఆలయ చైర్మన్‌ దాట్ల రామకృష్ణంరాజు, సహాయ కమిషనర్‌, కార్యనిర్వాహణాధికారి వి.సత్యనారాయణ తెలిపారు. అంతర్వేది అసిస్టెంట్‌ కమిషనర్‌ ఎంకేటీఎన్‌వీ ప్రసాద్‌, తనిఖీ అధికారి రామలింగేశ్వరరావు సమక్షంలో బుధవారం హుండీల ఆదాయాన్ని లెక్కించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ 45 రోజులకు గాను ఆలయంలో ప్రధాన హుండీ ద్వారా రూ.9,87,354, అన్నదాన హుండీ ద్వారా రూ.8,849 వెరసి రూ.9,96,203 సమకూరినట్లు తెలిపారు. వీటితో పాటు 5 విదేశీ రియాన్స్‌ వచ్చాయన్నారు. హుండీ ఆదాయం సొమ్మును దేవస్థానం ఖాతాకు జమ చేస్తున్నట్లు వివరించారు. తొలుత ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ యనమండ్ర సుబ్బారావు, బ్రహ్మశ్రీ యనమండ్ర సత్య సీతారామ శర్మ, బ్రహ్మశ్రీ పేటేటి శ్యామల కుమార్‌ హుండీలకు హారతి ఇచ్చి లెక్కింపును ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement