కోతలకు మరింత ఇబ్బంది
మోంథా తుపాను ప్రభావం ఇప్పటికీ రైతులను వెంటాడుతోంది. అప్పట్లో కురిసిన వర్షాలకు ఇప్పటికీ వరి చేలల్లో తడి ఆరలేదు. దీంతో వరి కోతలకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎకరం పొలంలో గంటలో పూర్తవ్వాల్సిన కోతలకు మూడు గంటల సమయం పడుతోంది. మళ్లీ తుపాను ప్రభావంతో వర్షం కురిస్తే వరి పంట కోసే పరిస్థితి ఉండదు. ధాన్యం రంగుమారి ఎందుకూ పనికిరాకుండా పోతాయి. రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది.
– బూరుగుపల్లి సుబ్బారావు,
వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్


