
మండ్య: తీవ్రమైన కడుపు నొప్పిని భరించలేక యువతి ఒకరు ప్రాణాలు తీసుకుంది. మండ్య జిల్లాలోని పాండవపుర తాలూకాలోని కణివెకొప్పలు గ్రామంలో సోమవారం ఈ సంఘటన జరిగింది. న్యాయవాది కణివె యోగేష్ కుమార్తె అయిన గౌతమి (21) కొంత కాలంగా తరచూ కడుపునొప్పితో బాధపడుతోంది. వైద్యులతో చికిత్స చేయించినా ప్రయోజనం లేకపోయింది. ఉదయం ఇంటిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.