దారణం: హత్యకు దారితీసిన యువకుల గొడవ

Young Man Last Breath After Clashed With Man In Nellore - Sakshi

సాక్షి, నెల్లూరు: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నల్ల కుక్కలగుంట  కూరగాయల మార్కెట్ వద్ద ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఘర్షణలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన ఆదివారం జరిగింది. కరివేపాకు వ్యాపారం చేసుకొని జీవించే సాయి అనే యువకుడికి అదే ప్రాంతానికి చెందిన దయానంద్‌తో చిన్నపాటి వివాదం తలెత్తింది. గొడవ మరింత ముదరడంతో దయానంద్‌ ఆవేశంతో సాయిపై కత్తితో దాడి చేశాడు. దీంతో సాయి అక్కడికక్కడే మృతి చెందాడు. స్లానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు   కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top