దొంగతనం విఫలం.. యువతిపై కాల్పులు

Woman Shot Dead By Men In Gurgaon After Failing To Looting Couple - Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధాని పరిసరాల్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కాబోయే భర్తతో సరదాగా బయటకు వెళ్లిన యువతి ఓ దొంగ చేతిలో తుపాకీ కాల్పులకు బలైన ఘటన గురుగ్రామ్‌‌లో జరిగింది. గత గురువారం జరిగిన ఈ ఘటన శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం... చత్తీస్‌‌గడ్‌‌‌కు చెందిన పూజ శర్మ అనే యువతి ఢిల్లీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిగా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో గతవారం నవంబర్‌ 3న తన కాబోయే భర్తతో కలిసి సాయంత్రం కారులో బయటకు వెళ్లింది. రెస్టారెంట్‌లో భోజనం చేసిన ఆనంతరం సరదాగా లాంగ్‌డ్రైవ్‌కు వెళ్లారు. (చదవండి: నకిలీ కార్డులు; లగ్జరీ షాపింగ్‌లు.. చివరికి)

ఈ క్రమంలో గుర్తుతెలియని దుండగులు మోటారు సైకిల్‌పై వెంబడించి లూటీ చేసే ప్రయత్నం చేశారు. అయితే వారి ప్రయత్నం విఫలం కావడంతో తుపాకితో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పూజ శర్మ తలకు బులెట్‌ తగిలి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దీంతో ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించడంతో బాధితురాలు మరణించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులను అరెస్టు చేశారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top