భర్త తిరిగి వచ్చేసరికే షాక్‌...భార్య, పిల్లలు..

Woman Killed Her Two Children And Committed Suicide - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఓ మహిళ ఇద్దరు పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్న సంఘటన బాలానగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. సీఐ కె.భాస్కర్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లాకు చెందిన మహేశ్‌, అనిత(22) దంపతులకు వర్షిణి(22 నెలలు), శ్రీహాన్‌ (9నెలలు) సంతానం. వారు గత నాలుగేళ్లుగా బాలానగర్‌ డివిజన్‌ గౌతంనగర్‌లో నివాసం ఉంటున్నారు. మహేష్‌ వృత్తిరీత్యా డ్రైవర్‌.

గత కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం మహేష్‌ డ్యూటీకి వెళ్లి తిరిగి వచ్చేసరి ఇంటి తలుపులు మూసి ఉన్నాయి. పలుమార్లు పిలిచినా అనిత తలుపులు తీయలేదు. దీంతో అనుమానం వచ్చిన మహేష్‌ కిటికీ లోంచి చూడగా అనిత ఉరేసుకుని కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు తెరిచి చూడగా అనిత ఉరేసుకుని ఉండగా ఇద్దరు పిల్లలు మృతి చెంది ఉన్నారు.  మృతదేహాలను స్వా«దీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ భాస్కర్‌ తెలిపారు.  

(చదవండి: పెళ్లై మూడేళ్లే అంతలోనే....ప్రాణం తీసిన కట్నపిశాచి)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top